సాధారణంగా ఎంత సెలబ్రిటీస్ అయినప్పటికి పెళ్ళి వయసు రాగానే మనసుకు నచ్చిన వాళ్ళనో..ఇంట్లో చూపించిన వాళ్ళనో పెళ్ళి చేసుకొని వైవాహిక జీవితాన్ని ఆనందిస్తారు. కాకపోతే మన సినిమా హీరోయిన్స్ మాత్రం కాస్త లేట్ గా మ్యారేజ్ చేసుకుంటుంటారు. అందుకు కారణం..స్టార్ ఇమేజ్ ఎక్కడ దెబ్బ తింటుందోనన్న భయం. అయితే హీరోయిన్స్ కి కొంతకాలం తర్వాత సినిమా అవకాశాలు తగ్గడంతో ఆటోమేటిక్ గా నెక్స్ట్ ఆప్షన్ పెళ్ళే. అయితే ఈ విషయంలో తాను పూర్తిగా రివర్స్ అంటుంది ఈ హీరోయిన్. పెళ్లి చేసుకునే ఆలోచన తనకు అసలు ఏమాత్రం లేదని మరోసారి తెగేసి చెప్పింది వరలక్ష్మి శరత్ కుమార్. కోలీవుడ్‌లో మంచి హీరోయిన్ గా కొనసాగుతున్న శరత్ కుమార్ కూతురు ఇలా తెగించి మాట్లాడంతో మరోసారి వార్తల్లోకి వచ్చింది. 

హీరోయిన్ గా వరుసగా సినిమాల్లో నటిస్తూ సక్సెస్ కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉంది. అయితే మధ్య మధ్యలో రకరకాల అంశాల మీద ఏదో రకంగా కామెంట్స్ చేస్తూనే ఉంటుంది. గతంలో వరలక్ష్మి హీరో విశాల్ తో చాలా సన్నిహితంగా మెలిగిందన్న విషయం అటు కోలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ లో అందరికి తెలిసిన సంగతే. అంతేకాదు వరలక్ష్మి-విశాల్ ప్రేమించుకుంటున్నారని కూడా ఇండస్ట్రీలో బాగా ప్రచారం జరిగింది. పెళ్లి కూడా చేసుకోబోతున్నారని బోలెడన్ని వార్తలు వచ్చాయి. అయితే నడిగర్ సంఘం ఎన్నికల్లో విశాల్ వర్సెస్ శరత్ కుమార్ ల మధ్య గట్టి యుద్ధమే సాగింది. అయితే ఆ సమయంలో కూడా వీరు కలగచేసుకోలేదు. నిమ్మకు నీరెత్తినట్టు సైలెంట్‌గా ఉన్నారు.

అయితే సడన్ గా ఏమైందో గానీ ఆ తర్వాత నుండి చాలాసార్లు విశాల్ ను వరలక్ష్మి విమర్శించింది. ఇదిలా ఉంటే విశాల్ పెళ్లికి రెడీ అయిపోయాడు. నిశ్చితార్థం కూడా జరిగినట్టు తెలుస్తుంది. కానీ వరలక్ష్మి మాత్రం పెళ్లి ప్రసక్తి తన జీవితంలో లేదని క్లారిటీగా చెప్తోంది. పెళ్లి చేసుకునే ఆలోచనే లేదని స్పష్టం చేస్తోంది. సినీ ఇండస్ట్రీలో చాలామంది పెళ్లి ప్రస్తావన తేగానే.. అప్పుడేనా ఇంకా చాలా టైం ఉంది..ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాను అంటుంటారు. అయితే శరత్ కుమార్ కూతురు మాత్రం పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని ప్రకటించేసింది. అలా అనడానికి విశాలే కారణమా..లేదా ఇంకేదైనా ఉందా అని కోలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: