బుధవారం జరిగిన ఎపిసోడ్ లో శ్రీముఖి ,రోహిణి ల మధ్య చిన్న ఇష్యూ జరిగింది. శ్రీముఖి రోహిణి తో నువ్వు ఈ వారం వెళ్ళిపోతావని మొహం మీదే చెప్పడంతో రోహిణి హర్ట్ అయింది. శ్రీముఖి నేను జస్ట్ అనాలసిస్  చేసాను దానికే అంత ఫీల్ అవ్వాలా అన్నా కూడా రోహిణి ఎమోషనల్ అయింది. ఈ విషయంలో శ్రీముఖి చేసింది తప్పే.  దాంతో అలా ఎందుకు అన్నావంటూ ఆషు, పునర్నవిలు రోహిణి వైపు స్టాండ్ తీసుకునే ప్రయత్నం చేసారు.


రోహిణి ఏడుస్తుంటే పునర్నవి అక్కడికి వచ్చి దాని అనాలసిన్ మనసులో ఉంచుకోమను, బయటకి ఎందుకు చెప్పడం, అసలు దానికి మనుషులే అక్కర్లేదు. కేవలం గేమ్ కావాలి అంతే అంటూ శ్రీముఖి పై తనకున్న అక్కసుని వెళ్ళగక్కింది.  ఇక ఆషు కనీసం సారీ అయినా చెప్పాల్సింది, అది మినిమమ్ కామన్ సెన్స్ అంటూ శ్రీముఖిని తప్పు బట్టింది. శ్రీముఖి చేసింది తప్పే అయినప్పటికీ, ఇష్యూని తగ్గించాలని చూడకుండా ఇంకా పెద్దది చేయడానికే ప్రయత్నించినట్టుగా అనిపిస్తుంది. దీనికి రెండు కారణాలున్నట్టుగా తెలుస్తుంది.


ముఖ్యంగా పునర్నవికి శ్రీముఖి అంతే మొదట్నుండి సరైన ఇంప్రెషన్ లేదు. పెద్ద ప్లాన్ తో గేమ్ ఆడుతోంది అని భావిస్తోంది. అందుకని శ్రీముఖిని కార్నర్ చేద్దామని ఈ విషయాన్ని ఇంకా పెద్దది చేయాలని అనుకుని ఉంటుంది. అందుకే సందు దోరికినప్పుడల్లా శ్రీముఖి పై తనకున్ను కోపాన్ని చూపెడుతూనే ఉంది. ఇక ఆషు విషయానికొస్తే బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుండి మూడు వారాల వరకు అసలు ఏ గొడవలోనూ తల దూర్చలేదు.


అదీగాక నాగార్జున గారు టైం రాదు మనమే తీసుకోవాలి అనే విషయాన్ని బాగా గ్రహించినట్టుంది. అందుకే అప్పటి నుండి హౌస్ లో కొంత ఆక్టివ్ గా ఉంటూ వస్తుంది. అందుకే శ్రీముఖి విషయంలొ రోహిణి వైపు స్టాండ్ తీసుకుని శ్రీముఖిని విమర్శించింది. సందు దొరికిందని శ్రీముఖి రెచ్చిపోయే ప్రయత్నం చేసారు



మరింత సమాచారం తెలుసుకోండి: