దర్శకుడు అనీల్ రావిపూడ, మహేష్ బాబును పరుగులు పెట్టిస్తున్నాడట. ఈ యంగ్ డైరెక్టర్ స్పీడ్ కు ప్రిన్స్ ఆశ్చర్యపోతున్నాడట. ఎంతలా అంటే.. లీవ్స్ తీసుకోకుండా.. గ్యాప్ లేకుండా అనుకున్నపని పూర్తయ్యేంత వరకు పట్టువదలని విక్రమార్కుడిలా ఉన్నాడట ఆ దర్శకుడు. ఎలాగైనా డెడ్ లైన్ లోగా మూవీ పినిష్ అయ్యేలా టార్గెట్ పెట్టుకున్నాడట. 

మహేష్ బాబు, రష్మిక జంటగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమా తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. రెండు నెలల కిందట మొదలైన ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ తో దూసుకెళ్తోంది. కాశ్మీర్ షెడ్యూల్ ఫినిష్ చేసిన దర్శకుడు రీసెంట్ గా అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ట్రైయిన్ సెట్ షూటింగ్ ఫినిష్ చేశారు. ఈ ట్రైయిన్ ఎపిసోడ్ సినిమాలో చాలా కీలకమని తెలుస్తోంది. 

సరిలేరు నీకెవ్వరూ ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్లు మినహా ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యిందట. త్వరలోనే మహేష్ పై ఆర్మీలో బ్యాక్ డ్రాప్ సీన్స్ షూట్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఆపై మాజీ రామోజీ ఫిలింసిటీలో కొండారెడ్డి బురుజు సెట్ షూట్ చేయనున్నారట. ఇక క్లయిమాక్స్ ను కేరళలో ప్లాన్ చేయబోతున్నట్టు సమాచారం. దీంతో పాటలు మినహా టోటల్ సినిమా పూర్తి అయినట్టే అంటున్నారు. 

సరిలేరు నీకెవ్వరూ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. నాలుగు నెలల సమయం మాత్రమే ఉండటంతో దర్శకుడు అనీల్ రావిపూడి జెట్ స్పీడ్ తో షూట్ చేస్తున్నారట. చెప్పిన సమయం కంటే ముందే సినిమాను పూర్తి చేయాలని భావిస్తున్నాడట. మహేష్ కూడా ఏమాత్రం గ్యాప్ తీసుకోవడం లేదట. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, అనీల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే వచ్చే జనవరి మహేష్ బాబు అభిమానులకు అది నిజమైన సంక్రాంతి అవుతుంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: