రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా సాహోకు సంబందించిన ప్రి రిలీజ్ వేడుక ఈనెల 18వ తేదీన హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో యూనిట్ సభ్యులు మరియు పలువురు అతిథుల సమక్షంలో ఎంతో వైభవంగా జరగున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ మరియు బాలీవుడ్ కి చెందిన పలువురు నటులు హాజరుకానున్న ఈ వేడుక తాలూకు ఏర్పాట్లు ఇప్పటికే ఫుల్ స్వింగ్ లో సాగుతున్నాయట. ఇకపోతే మరోవైపు సాహోను అవకాశం ఉన్నంతవరకు దేశవ్యాప్తంగా అత్యథిక థియేటర్స్ లో రిలీజ్ చేసేలా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. 

సినిమా రిలీజ్ కు మరొక 15 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉండడంతో ప్రభాస్ మరియు శ్రద్ధ అప్పుడే పూర్తి స్థాయిలో సినిమాను ప్రమోషన్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇటీవల బాలీవుడ్ మీడియాతో సాహో టీమ్ ఇంటరాక్ట్ అవుతున్న సమయంలో, వరుసగా అందరూ  మాట్లాడిన తరువాత చివరిగా మైక్ తీసుకున్న శ్రద్ధ కపూర్ మాట్లాడుతూ, తాను ఇప్పటివరకు నటించిన హీరోల్లో ప్రభాస్ వంటి నటుడిని ఇప్పటివరకు చూడనే లేదని, సినిమాలోని కొన్ని ముద్దు సన్నివేశాల్లో నాదగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకోమంటే, తెగ సిద్డగుపడిపోయేవాడని, అంతేకాక అటువంటి సీన్ ఎంత త్వరగా అయిపోతే అంత బాగుంటుందని అనేవాడట. 

ఇక ప్రస్తుతం జరుగుతున్న ఈ కార్యక్రమంలో, కాసేపటి క్రితం నువ్వు నేను కలిసి మీడియా వారికి ఫోటోలకు ఫోజులు ఇవ్వాలి, కాస్త నన్ను హగ్ చేసుకో అని అడగ్గానే, ప్రభాస్ సిగ్గుపడడం చూసిన తనకు కూడా సిగ్గుతోపాటు నవ్వు కూడా ఆగలేదు అంటూ ఆమె మీడియాతో నవ్వులు పూయిస్తూ మాట్లాడారు. ఇప్పటికే విఎఫ్ఎక్స్, డబ్బింగ్ వంటి కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా, రేపు విడుదల తరువాత ప్రేక్షకుల అంచనాలు ఏ మేరకు అందుకుంటుందో వేచి చూడాలి...!!


మరింత సమాచారం తెలుసుకోండి: