స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ ఇంటి సభ్యుల చేత సమాజాన్ని చైతన్యపరిచే విధంగా స్కిట్ చేయించారు. హౌస్ లో వాతావరణం మొత్తం దేశభక్తి తో నిండిపోయింది. రెండు గ్రూపులుగా విడిపోయి ఒక గ్రూపు ఏమో మగవాళ్ళు ఆడవాళ్ళు సమానత్వం పై స్కిట్ చేయగా మరొక గ్రూప్ ఎంటర్టైన్ చేసింది. ఈ సందర్భంగా మగవాళ్ళు ఆడవాళ్ళు సమాజంలో ఎలా మెలగాలి అనే కాన్సెప్ట్ గురించి చేసిన స్కిట్ ఎపిసోడ్ హైలెట్ అయింది. ఈ స్కిట్ మహేష్, రవి, పునర్నవి, వితికా, అషు‌లు చేసి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు.


ఈ సందర్భంగా ఇంటి సభ్యులు ఈ స్కిట్ లో భాగంగా మగవాళ్ళ అయిన రవి మహేష్ ఇద్దరూ మగ వాళ్ళు ఎంతమంది తోనైనా మాట్లాడవచ్చు...ఎవరితోనైనా ఉండవచ్చని తమ తమ వాదనలు వినిపించిన వాళ్ళు కౌంటర్ అషు, వితికా చెలరేగిపోయారు. నచ్చినట్లుగా ఇంట్లో ఉండలేమని, పెళ్లి అనే ఒక్క కారణంతో ఇష్టాలన్నింటినీ వదిలేసి, కుటుంబాన్ని వదిలేసి అన్నింటినీ త్యాగం చేస్తామని అషు రెడ్డి తన వాదన వినిపించగా.. సమాజంలో ఆడపిల్ల ఎలా అణచివేయబడుతుందో ఎమోషనల్‌గా తెలియజేస్తూ ఆడవాళ్ల గొప్పతనం తెలియజేసింది వితికా.


దీంతో వెంటనే సీన్లోకి ఎంటర్ అయింది పునర్నవి. అసలు ఆడవాళ్లు ఎందుకు మాట్లాడకూడదు...మగవాళ్ళ కంటే ఆడవాళ్లు ఎందులో తక్కువ కాదు అంటూ తన స్టైల్లో రెచ్చిపోయింది. ఒక అబ్బాయి నలుగురు అమ్మాయిలతో మాట్లాడితే అది కరెక్ట్ అదే అమ్మాయి నలుగురు అమ్మాయిలతో మాట్లాడితే తప్పు అని మీరు ఎలా డిసైడ్ చేస్తారు..? స్త్రీలను గౌరవించడం అంటే ఇదేనా అంటూ ఆవేశపూరితంగా చచ్చిపోయింది హౌస్ లో పునర్నవి. మొత్తంమీద ఆగస్టు 15న జరిగిన ఈ ఎపిసోడ్ షో కి హైలెట్గా నిలిచింది. చాలామంది స్కిట్ గురించి సోషల్ మీడియాలో ప్రస్తుతం చర్చించుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: