పవన్ కళ్యాణ్ తో జత కడితే ఆ హీరోయిన్ పంట పండినట్టే అని ప్రణీతతో మరోసారి రుజువు అవుతోంది. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ మరదలు గా నటించి అధ్బుత ప్రతిభను కనపరచిన ప్రణీత ఇప్పుడు పండగ చేసుకుంటోంది అంటున్నారు. ఎలాగైనా టాలీవుడ్ లో అడుగు పెట్టాలనుకున్న ప్రణీతకు పవన్ సినిమా ఇచ్చిన లక్కుతో దశ తిరిగిపోయింది. అలా సినిమా విడుదలై హిట్టుకొట్టిందో లేదో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంతే భారి అంచనాలతో తీస్తున్న ‘రభస’ లో చాన్స్ కొట్టేసింది. ఇక ఇతర ఆఫర్ల సంగతి వేరే చెప్పనక్కర్లేదట. చేతి నిండా సినిమాలు ఉంచుకునేంతగా ఆఫర్లు వచ్చాయట ప్రణీతకు. అత్తారింటికి దారేది విడుదల ఆలస్యం అవుతున్న సమయంలో ఎంత దిగాలు పడిందో ఇప్పుడు అంత సంబరపడుతోందట ప్రణీత. ఇక మరో అరుదైన అవకాశాన్ని కూడా తాజాగా కొట్టేసింది. నవంబర్ 14 నుంచి మొదలు కానున్న అంతర్జాతీయ పిల్లల చలనచిత్రోత్సవ వేడుకల్లో( ఐసిఎఫ్ఎఫ్ఐ) పాల్గొనేందుకు ఆహ్వానం అందుకుంది. ఈ వేడుకలను రణబీర్ కపూర్ ప్రారంభించనున్నాడు. 80 దేశాల నుంచి 900 ల చిన్నపిల్లల సినిమాలు ప్రదర్శించనున్నారు. ఐమాక్స్ థియేటర్లో జరగనున్న ఈ వేడుకలకు పవన్ కళ్యాణ్ కూడా హాజరుకానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: