నందమూరి బాకృష్ణ 105వ సినిమాగా కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో సినిమా మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఎన్.టి.ఆర్ బయోపిక్ తర్వాత అసలైతే బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేయాల్సి ఉంది. కాని ఆ ప్రాజెక్ట్ ఎందుకో పట్టాలెక్కలేదు. ప్రస్తుతం కె.ఎస్ రవికుమార్ సినిమా సెట్స్ మీద ఉంది. ఈ సినిమా 2020 సంక్రాంతికి రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. 


ఈ మూవీ తర్వాత బాలయ్య బాబు మరోసారి పూరి జగన్నాథ్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని అంటున్నారు. ఆల్రెడీ ఈ ఇద్దరి కాంబినేషన్ లో పైసా వసూల్ సినిమా వచ్చింది. 100 సినిమాలు చేసిన బాలకృష్ణలో ఆ సినిమాలో చూసిన ఎనర్జీ, స్టైల్ ఏ సినిమాలో చూడలేదని నందమూరి ఫ్యాన్స్ కూడా అనుకున్నారు.


పైసా వసూల్ టైంలోనే పూరితో మరో సినిమా ఉంటుందని అన్నారు బాలకృష్ణ. ఈమధ్యనే ఇస్మార్ట్ శంకర్ తో సెన్సేషనల్ హిట్ అందుకున్న పూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి చేశాక మరోసారి బాలకృష్ణతో సినిమా చేస్తాడని తెలుస్తుంది. పైసా వసూల్ బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరచాగా ఈసారి కమర్షియల్ గా కూడా హిట్ కొట్టేలా సినిమా చేస్తారని తెలుస్తుంది.   


పూరి, బాలకృష్ణ మూవీ ఎన్.బి.కే పిక్చర్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ కలిపి సినిమా నిర్మిస్తారట. ఇస్మార్ట్ శంకర్ హిట్ తో ఫాం లోకి వచ్చినట్టు కనిపిస్తున్న పూరి విజయ్ సినిమా హిట్ పడితే మాత్రం మళ్లీ స్టార్ లీగ్ లోకి వచ్చేసినట్టే అవుతుంది. ఇన్నాళ్లు ఫ్లాపుల్లో ఉన్నాడని పూరిని పక్కన పెట్టిన స్టార్ హీరోలు ఇక మీదట అయినా అవకాశాలు ఇస్తారేమో చూడాలి. విజయ్ దేవరకొండ సినిమా కూడా మాస్ ఆడియెన్స్ ను అలరించేలా ఉంటుందని తెలుస్తుంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: