ప్రభాస్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ‘సాహో’ సినిమా విడుదల దగ్గర పడుతున్న కొద్దీ ప్రభాస్ అభిమానుల లో ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ఇటీవల సినిమాకి సంబంధించిన ట్రైలర్ విడుదలైన క్రమంలో ట్రైలర్ లో ఉన్న సన్నివేశాలు ఇండియన్ సినిమా ప్రేక్షకులను మరి ప్రభాస్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ట్రైలర్ లో ఉన్న సన్నివేశాలు చూస్తుంటే హాలీవుడ్ స్థాయిలో సినిమాలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించినట్లు అర్థం అవుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో తాజాగా సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక రామోజీ ఫిలిం సిటీలో అంగరంగ వైభవంగా జరిగింది.


సినిమాకి సంబంధించిన అనేక విషయాలు రిలీజ్ వేడుకకు వచ్చిన అతిధులు మరియు సినిమా యూనిట్ అభిమానులకు చెప్పుకొచ్చారు. ఆగస్టు 30వ తారీఖున భారీ స్థాయిలో విడుదల కాబోతున్న ‘సాహో’ సినిమా బెనిఫిట్ షోలు గురించి అదిరిపోయే వార్త ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది. అదేమిటంటే సినిమాకి సంబంధించిన బెనిఫిట్ షోలు విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటానికి ఇప్పటికి సిద్ధమైనట్లు పరిస్థితులు బట్టి టాక్ వినపడుతోంది. దీంతో ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.


తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషలలో తెరకెక్కిన ఈ సినిమా మొట్టమొదటి బెనిఫిట్ షో తెలుగులో పడుతున్నట్లు సమాచారం. సో ఇప్పుడీ వార్త నిజమైతే డార్లింగ్ ఫ్యాన్స్ ప్రపంచంలో అందరి కంటే ముందే సాహో చూసేయొచ్చన్న మాట. ఆ షోతో మొదలై మిగిలిన చోట్ల తెల్లవారుఝాము నుంచి సాహో సందడి ఓ రేంజ్ లో దేశవ్యాప్తంగా ఆగస్టు 30న ఉండబోతున్నట్లు టాక్ వినపడుతోంది. ప్రభాస్ కెరియర్ లోనే దాదాపు భారీ యాక్షన్ చిత్రంగా సాహో సినిమా విడుదల కానుంది. ముఖ్యంగా బాహుబలి స్థాయి లో సాహో సినిమాతో హిట్టు కొట్టాలని యాక్షన్ తో కూడిన ఈ స్టోరీ నీ ప్రభాస్ ఎంచుకున్నారట.



మరింత సమాచారం తెలుసుకోండి: