క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాలలో నటించి గుర్తిపు తెచ్చుకున్న అడవి శేష్ .. సోలో హీరోగా గూఢచారి తొలిసినిమాతోనే విజయం అందుకొని ద్వితీయ ప్రయత్నంగా  నటించిన ఎవరు మూవీ ఈ శుక్రవారం విడుదల అయ్యి థియేటర్ లలో సందడి చేస్తుంది. అయితే.. ఇప్పుడు ఈ సినిమాకు ప్రముఖుల నుండి ప్రశంసలు లభిస్తున్నాయి. తాజాగా.. ఈ సినిమా చూసిన అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపాడు.


నిన్న రాత్రి ఎవరు సినిమా చూసాను. సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా వుంది. అడవి శేష్, రెజినా, నవీన్ చంద్ర, మురళీశర్మ అద్భుతంగా నటించారు. మర్డర్ మిస్టరీగా చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించిన టీం అందరికి నా శుభాకాంక్షలు అని స్టైలిష్ స్టార్ ట్వీట్ చేసాడు. అయితే అల్లు అర్జున్ ట్వీట్ చిత్ర విజయానికి మరింత హెల్ప్ అవుతుందని సినీ జనాలు అనుకుంటున్నారు. 


ఇదిలావుంటే.. అల్లు అర్జున్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అల వైకుంఠపురములో' అనే చిత్రంలో నటిస్తున్నాడు. అంతకు ముందు వీరిద్దరి కలయికలో జులాయి, సన్ అఫ్ సత్యమూర్తి చిత్రాలు వచ్చాయి. అరవింద సమేత వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత త్రివిక్రమ్, నా పేరు సూర్య అట్టర్ ప్లాప్ తర్వాత అల్లు అర్జున్ జత కట్టడం అలాగే వీరిద్దరిది గతంలో విజయవంతం అయిన కాంబినేషన్ అవడంతో చిత్రం భారీ అంచనాలు వున్నాయి.


ఇకపోతే.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత కొంతకాలంగా హీరోల మధ్య స్నేహపూరిత వాతావరణం నెలకొంది. ఒకరి సినిమాలు ఒకరు చూడటం.. ఒకరి నటనను ఒకరు పొగుడుకోవటం.. చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయడం వంటి ఆరోగ్యకరమైన పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే తెలుగు సినిమా మరో వందేళ్లు వర్థిల్లుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: