టాలీవుడ్ సినిమా పరిశ్రమకు మొదట్లో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన అడివి శేష్, కర్మ అనే సినిమాలో నటించడం జరిగింది. అయితే అప్పట్లో ఆ సినిమా ఫ్లాప్ గా నిలిచి, ఆయన కెరీర్ ను ఇబ్బందుల్లోకి నెట్టింది. అయినప్పటికీ తన మొక్కవోని దీక్ష, పట్టుదలతో మెల్లగా సినిమాల్లో అక్కడక్కడ చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ, ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాదిస్తూ వెళ్తున్న శేష్ కు, అనూహ్యంగా పివిపి సంస్థలో క్షణం సినిమా చేసే అవకాశం రావడం, ఆ సినిమాకు కథను అందించడంతో పాటు ఆయనే స్వయంగా సినిమాలో ప్రధాన పాత్రలో నటించడం జరిగింది. ఇక ఆ సినిమా సూపర్ హిట్ గా నిలవడంతో, కెరీర్ పరంగా శేష్ మంచి ట్రాక్ లోకి వచ్చారు. ఆ తరువాత నటించిన గూఢచారి సూపర్ హిట్ అయి, 

శేష్ కు మరింత పేరు తీసుకువచ్చింది. ఇకపోతే ఇటీవల ఆయనే స్వయంగా రచించి, నటించిన కొత్త సినిమా ఎవరు కూడా ప్రస్తుతం సూపర్ హిట్ టాక్ తో, అద్భుతమైన కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే ప్రేక్షకులతో పాటుగా పలువురు సినిమా ప్రముఖుల నుండి మంచి ప్రశంశలు అందుకున్న ఈ సినిమాపై, నేడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అబినందనలు కురిపించారు. ఇవాళ ఎవరు సినిమా చూసాను, అద్భుతమైన థ్రిల్లర్ గా ఈ సినిమాను ప్రేక్షకులను అలరించేలా రూపొందించిన దర్శకుడికి, హీరో శేష్ కు, అలానే టీమ్ మొత్తానికి తన తరపున శుభాభినందలు అంటూ మహేష్ తన పోస్ట్ లో తెలిపారు. అయితే మహేష్ పోస్ట్ ను రీట్వీట్ చేస్తూ, మా సినిమాను వీక్షించి మమ్మల్ని మరింత ఎంకరేజ్ చేసినందకు మీకు కృతజ్ఞతలు సర్, 

మీ మాటలు మా సినిమాకు ఎంతో మేలు చేకూరుస్తాయి, మీ నిర్మాణంలో అతిత్వరలో నటించబోయే మేజర్ సినిమా కోసం నేను ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నాను అంటూ రిప్లై ఇవ్వడం జరిగింది. అలానే మరొక నటుడు నవీన్ చంద్ర స్పందిస్తూ, మహేష్ బాబుగారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, మీలాంటి గొప్ప వ్యక్తి నుండి మాకు లభించిన ఈ ఎంకరేజ్మెంట్ కు ధన్యవాదాలు సర్ అంటూ ఆయన కూడా మహేష్ ట్వీట్ కు రిప్లై ఇవ్వడం జరిగింది. కాగా మహేష్ బాబు చేసిన ఆ ట్వీట్, ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది...!!


మరింత సమాచారం తెలుసుకోండి: