కింగ్ నాగార్జున హోస్ట్ గా వస్తున్న బిగ్ బాస్ సీజన్ 3లో సర్ ప్రైజ్ లు చాలానే ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఆరు వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో ఐదుగురు కంటెస్టంట్స్ ఎలిమినేట్ అయ్యారు. అయితే బిగ్ బాస్ లోకి ఇప్పుడు మరో కంటెస్టంట్ ను లోపలకు పంపించే టైం వచ్చిందని అంటున్నారు. 


గత రెండు రోజుల నుండి తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బ బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్తుందని వార్తలు వచ్చాయి. ఆదివారం ఆమె ఎంట్రీ ఉంటుందని అనుకున్నారు కాని అలా ఏం జరుగలేదు. ఈషా రెబ్బ మాట అటుంచితే బిగ్ బాస్ హౌజ్ లోకి జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ఇంట్లోకి వెళ్తున్నాడని తెలుస్తుంది. అందుకే ఒకవారం ఆది జబర్దస్త్ లో కనిపించలేదని సమాచారం.


లాస్ట్ థర్స్ డే జబర్దస్త్ లో హైపర్ ఆది టీం కనిపించలేదు. జబర్దస్త్ లో ఎక్కువ నవ్వించేది హైపర్ ఆది టీమే. ఆది పంచులతో కడుపుబ్బా నవ్వుకుంటారు బుల్లితెర ప్రేక్షకులు. అయితే ఆది లేని టైంలో మిగతా టీం మెట్స్ తో స్కిట్ వేసేవారు. లాస్ట్ వీక్ ఎపిసోడ్ లో హైపర్ ఆది టీం లేకుండా షో నడిచింది. అయితే కొంతమంది జబర్దస్త్ నుండి హైపర్ ఆది టీం బయటకు వెళ్లిందని వార్తలు వచ్చాయి. కాని అలాంటిదేమి జరుగలేదు.. ఈ వారం జబర్దస్త్ ప్రోమోలో ఆది స్కిట్ వేశాడు.  


ఇక బిగ్ బాస్ లో ఆది కంటెస్టంట్ గా కాకుండా ఒకరోజు మొత్తం అందులో గడిపే గెస్ట్ గా వెళ్తున్నాడని తెలుస్తుంది. లాస్ట్ సీజన్ లో ప్రదీప్, అనసూయ ఇలానే హౌజ్ లోకి వెళ్లి వచ్చారు. ఈ సీజన్ లో సుధీర్, హైపర్ ఆదిలను బిగ్ బాస్ హౌజ్ లోకి పంపించి కంటెస్టంట్స్ కు ఉత్సాహాన్ని నింపేలా ప్లాన్ చేశారు. మరి హైపర్ ఆది నిజంగానే బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: