రోజు రోజుకు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్న బిగ్‌బాస్ సీజ‌న్ 3 ఆదివారం సంద‌డి ఓ రేంజ్‌లో జ‌రిగింది. నాలుగు వారాలు పూర్తి చేసుకున్న ఇంటి స‌భ్యులు ఐదో వారంలో ఆట‌ను మ‌రింత రంజుగా మార్చారు. ఇక ఐదోవారం ఎలిమినేషన్‌లో ఏడుగురు రాహుల్, హిమజ, అషు, మహేష్, పునర్నవి, శివజ్యోతి, బాబా భాస్కర్‌‌‌ ఉన్నారు. ఈ ఏడుగురిలో శ‌నివారం నాగార్జున  శివజ్యోతి, మహేష్ విట్టాలను సేఫ్ చేశారు. శ‌నివారం మిగిలిన ఇంటి స‌భ్య‌ల్లో ఎవ‌రు ఇంటికి వెళ్తారు అన్న దానిపై ఉత్కంఠ‌ నెల‌కొంది.


ఇక ఆదివారం ‘కన్నెపెట్టరో కన్నుకొట్టరో’ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఎప్ప‌టిలాగానే సన్‌‌డేను ఫన్‌డేగా మార్చేశారు. హాట్ హాట్‌గా సాగిన‌ శ‌నివారం త‌ర్వాత వ‌చ్చిన ఆదివారం ఎంతో ఫ‌న్నీగా సాగింది. వచ్చీరాగానే మన టీవీ ద్వారా ఇంటి సభ్యులకు హాయ్ చెప్పారు. నాగార్జున మంచి మంచి టాస్కుల‌తో హౌస్ మేట్స్‌ను ఆడిస్తూ మ‌ధ్య మ‌ధ్య‌లో ఎటిమినేష‌న్‌లో ఉన్న ఒక్కొక్క‌రిని సేఫ్ చేశారు. 


ఆ క్ర‌మంలోనే ముందుగా బాబా భాస్క‌ర్.. ఆ త‌ర్వాత పున‌ర్న‌వి, రాహుల్‌ను సేఫ్ చేశారు. ఇక చివ‌రిగా మిగిలిన అషు, హిమ‌జ‌ల‌లో అషు ఎలిమినేట్ అయింది. బిగ్ బాస్ హౌస్‌లో నుంచి బయటికి వచ్చిన అషు రెడ్డిని నాగార్జున వేదికపైకి ఆహ్వానించారు. ఆమెతో నాగార్జున బిగ్‌బాస్ హౌస్‌లో అర్హులెవ‌రు అన్న గేమ్ ఆడించారు. 


ఈ క్ర‌మంలోనే ఇంటి స‌భ్య‌ల‌ ఫొటోలు పెట్టి అన‌ర్హుల ఫొటోల‌ను పగలగొట్టమని నాగార్జున సూచించారు. దీంతో  రాహుల్, హిమజ, మహేష్, వితికా షెరు ఇంట్లో ఉండకూడదని వారి ఫొటోలను ఒక్కొక్క‌టిగా అషు పగలగొట్టింది. మిగిలిన ఇంటి స‌భ్య‌లు బాబా భాస్క‌ర్‌, అలీ రెజా, శ్రీ‌ముఖి, శివ‌జ్యోతి, పున‌ర్న‌వి, ర‌వికృష్ణ‌, వ‌రున్‌, ఇంట్లో కొన‌సాగాల‌ని అషు చెప్పింది.


మరింత సమాచారం తెలుసుకోండి: