దివంగత అందాల నటి అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూర్ హీరోయిన్ గా ఇటీవల ఎంట్రీ ఇచ్చిన సంగతి మనకందరికీ తెలిసినదే. ధడక్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ మొట్టమొదటి సినిమా సందర్భంగా పెద్దగా స్కిన్ షో చూపించలేదు. దాన్ని బయట చాలా చోట్ల మీడియా ముందు ఇంకా అనేక వేడుకలలో సినిమా కార్యక్రమాలలో చాలా హాట్ గా తయారై కనిపిస్తుంటుంది.


చాలా పొట్టి పొట్టి గౌన్లు వేసుకుంటూ కుర్రకారు మతి పోగొట్టేలా దుస్తులు ధరిస్తూ వీలైనంతగా చాలా గ్లామర్ గా కనిపించడానికి రెడీ అవుతుంది. దీంతో జాన్వి కపూర్ కి యూత్ లో మంచి విపరీతమైన ఫాలోయింగ్ ముందు నుండి ఏర్పడింది. ఇటువంటి నేపథ్యంలో తాజా ఈ బ్యూటీ ఢిల్లీలో జరిగిన ఓ బుక్ లాంచ్ ఈవెంట్ కి హాజరైంది. హరిందర్ సిక్కా రచించిన 'కాలింగ్ సెహ్మత్' కి హిందీ వెర్షన్ ని లాంచ్ చేయడానికి జాన్వీని ప్రత్యేకంగా ఆహ్వానించారు. అయితే ఆ ఈవెంట్ కి వెళ్లిన ఈ బ్యూటీని ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.


దానికి కారణం జాన్వీ పుస్తకాన్ని తిప్పి పట్టుకుంది. దీంతో నెటిజన్లు ఆమెని టార్గెట్ చేశారు. 'ది బ్యూటీ విత్ నో బ్రెయిన్' అంటూ ఆమెపై కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే మరీ దారుణంగా జాన్వీపై విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా కార్యక్రమానికి అనుగుణంగా జాన్వికపూర్ చీర కట్టుకుని వచ్చింది. దీంతో నెటిజన్లు మరొకసారి శ్రీదేవి గారిని గుర్తు చేశారు అని కామెంట్ లో పెడుతూ చీరకట్టులో జాన్వికపూర్ చాలా అందంగా ఉందని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం జాన్వికపూర్ 'తక్త్' అనే సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో పెద్ద వైరల్ గా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి: