దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం "సాహో". బాహుబలి ప్రభాస్ నటించిన ఈ చిత్రం ఆగస్టు 30 ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది. ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుండి ఈ సినిమాకి అనూహ్యమైన స్పందన వచ్చింది. అదీ గాక మన డార్లింగ్ ప్రభాస్ ప్రమోషన్లలో యమా బిజీగా ఉన్నాడు. ప్రభాస్ మీడియాలో ఇంతలా కనిపించడం ఇదే మొదటిసారి. బాహుబలి సమయంలో కూడా ఇంతలా ఆక్టివ్ గా ప్రమోషన్లలో కనిపించలేదు.


ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రధాన చిత్ర పరిశ్రమలలో సాహో గురించే మాట్లాడుకుంటున్నారు. ఏ ఇద్దరు మూవీ ప్రేమికులు కలిసినా సాహో గురించే చెప్పుకుంటున్నారు. అంతలా సాహో ఫీవర్ దేశాన్ని పట్టిపీడిస్తోంది. సాహోకి వస్తున్న ఈస్పందన బాలీవుడ్ బడా హీరోలను బెంబేలెత్తిస్తోంది.అసలు ఒక ప్రాంతీయ హీరో సినిమాకు ఇంత క్రేజ్ రావడానికి కారణమేంటని వారు తలలు పట్టుకుంటున్నారు.


బాలీవుడ్ లో భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కుతున్నా వాటికి దేశవ్యాప్తంగా ఇంత హైప్ రాకపోవడం గమనార్హం. అమీర్, సల్మాన్ వంటి స్టార్ హీరోల సినిమాలకు నార్త్ మినహా ఇస్తే, సౌత్ లో అంతగా ప్రచారం దక్కడం లేదు. బాలీవుడ్ లో బడా చిత్రంగా తెరకెక్కుతున్న బ్రహ్మాస్త్ర గురించి ఎవ్వరికీ అంతగా తెలియదు? కానీ సాహో మాత్రం చిత్రీకరణ దశ నుండి దేశవ్యాప్తంగా వార్తలలో ఉంటూ వచ్చింది.ఇదంతా బాహుబలి ప్రభావమే అని చెప్పక్కర్లేదు


గతంలో అమీర్ ఖాన్, కత్రినా, అమితాబ్ వంటి స్టార్ కాస్ట్ తో వచ్చిన భారీ బడ్జెట్ తెరకెక్కిన థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ కి కూడా అనుకున్నంత ప్రచారం దక్కలేదు. కానీ సాహో విషయంలో మాత్రం ఇంత ప్రచారం కలగడం వారిని ఒకింత ఈర్ష్య పడేలా చేస్తుంది. అలాగే సైరా, ఆర్ ఆర్ ఆర్ వంటి చిత్రాలు కూడా దేశవ్యాప్తంగా మంచి ప్రచారం దక్కించుకుంటున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: