అందాల  శ్రీదేవి సౌత్ నుంచి  నార్త్ కి వెళ్ళి తన సత్తా చాటుకుంది. ఇండియన్ స్క్రీన్ మీద అతిలోక సుందరిగా పేరు తెచ్చుకుంది. కొన్నేళ్ళు ఇండియన్ సూపర్ స్టార్ గా తిరుగులేని విధంగా హవా చలాయించింది. మరి శ్రీదేవి ఇన్ని విజయాలకు పునాది మాత్రం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీనే. ఇక్కడే  ఆమె నటనలో ఓనమాలు దిద్దుకుంది. ఆమెకు ఎన్నో అవకాశాలు బాల నటిగా దగ్గర నుంచి హీరోయిన్ గా ఇచ్చి పెంచి పెద్ద చేసింది సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ.


మరి శ్రీదేవి కూతురుకు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ప్రేమ లేదా, చిన్న చూపు ఉందా..ఇలా అనేక డౌట్లు వస్తున్నాయి.  ఆమె తెలుగులో మెగాస్టార్ తన‌నుడు రాం చరణ్ మూవీలో చేస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. అంతెందుకు ఆమె డెబ్యూ మూవీయే టాలీవుడ్లో ఉంటుందని కూడా అంతా అనుకున్నారు. అయితే జాహ్నవీ కపూర్ మాత్రం వరసగా బాలీవుడ్ మూవీస్ చేసుకుంటూ వెళ్తున్నారు.


దాంతో శ్రీదేవి కూతురు ఎవరికీ అందదని కూడా రూమర్స్ వచ్చాయి. దీని మీద అమె తండ్రి, శ్రీదేవి భర్త బోనీ కపూర్ లేటెస్ట్ గా మీడియాకు ఓ క్లారిటీ ఇచ్చారు. తన కుమార్తె జాహ్నవీ కపూర్ టాలీవుడ్ మూవీస్ లో నటించి తీరుతుందని కూడా చెప్పారు. తమకు సౌత్ మీద ఎటువంటి చిన్న చూపూ లేదని కూడా చెప్పారు.


శ్రీదేవిని సౌత్ ఆదరించిందని, ఆమె కూడా తన కూతురు తెలుగు నుంచి పరిచయం కావాలని కోరుకున్నారని వెల్లడించారు. సరైన సమయం సరైన కధతో జాహ్నవి టాలీవుడ్ కు ఎంట్రీ  ఇస్తుందని బోనీ పక్కాగా చెప్పేశారు. తమ కుటుంబానికి టాలీవుడ్లో సూపర్ స్టార్  క్రిష్ణ కుటుంబంతో పాటు, మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో మంచి రిలేషన్లు ఉన్నాయని బోనీ చెప్పడం విశెషం.


అంటే టాలీవుడ్లో జాహ్నవి ఎంట్రీ ఇస్తే మహేష్ బాబు, రాం చరణ్ ల పక్కనే కచ్చితంగా నటిస్తుందని అర్ధమవుతోంది. మరి ఆ రోజు కోసం శ్రీదేవి అభిమానులు వెయిట్ చేయాల్సిందే. ఇదిలా ఉండగా పూరీ తన తాజా సినిమాలో జాహ్నవి ని హీరోయిన్ గా చేద్దామని గట్టిగా ట్రై చేసినట్లుగా న్యూస్ వచ్చింది. మరి ఇపుడు బోనీ స్టేట్మెంట్ తో కొన్నాళ్ళ పాటు జాహ్నవీ కపూర్ ని తెలుగు తెర మీద చూసేందుకు ఆగాలని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: