కెజిఎఫ్ .. కన్నడ కన్నడ నాట భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కి సంచలన విజయాన్ని అందుకున్న చిత్రం. ఒక్క కన్నడలోనే కాదు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ నీల్  కూడా ఒక్కసారి మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిపోయాడు. ప్రస్తుతం ఇతగాడితో సినిమా చేయడానికి స్టార్ హీరోలు అందరూ ఆసక్తి చూపిస్తున్నారంటే కెజిఫ్ అటు జనాల్లోనూ, ఇటు హీరోలందరిలోనూ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.


ఇప్పటికే టాలీవుడ్ బాద్ షా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ సినిమా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందని.. ఎన్టీఆర్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత అతని దర్శకత్వంలోనే నటిస్తున్నాడని సినీజనాలు కోడై కూస్తున్నారు. ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు కానీ.. ఇప్పుడు ఈ వార్తతో పాటు ప్రభాస్ తో కూడా ఈ దర్శకుడి సినిమా ఉంటుందంటూ తెగ ప్రచారం జరుగుతుంది. తాజాగా సాహో ప్రమోషన్ లో పాల్గొన్న ప్రభాస్ కెజిఎఫ్ దర్శకుడితో సినిమా గురించి క్లారిటీ ఇచ్చేసాడు.ప్రశాంత్ నీల్ తో నేను సినిమా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.


అందులో ఎలాంటి నిజం లేదు. మా మధ్య ఇంతవరకు ఎలాంటి చర్చలు జరగలేదని యంగ్ రెబల్ స్టార్  క్లారిటీ ఇచ్చాడు. సో ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ సినిమా చేస్తున్నాడంటూ వచ్చే న్యూస్ కి పులిస్టాప్ పడింది. ప్రస్తుతం కెజిఎఫ్ 2 చిత్రీకరణలో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ ఆ సినిమా పూర్తయ్యాక ఎన్టీఆర్ సినిమా చేస్తాడు. ఇదిలా ఉంటే కెజిఫ్ సూపర్ హిట్ తో కన్నడ హీరో యశ్ ఇమేజ్ ఒక్కసారిగా ఆకాశాన్ని తాకింది. అదే దర్శకుడు సేమ్ హీరో తో తెరకెక్కిస్తున్న పార్ట్ 2 కూడా ఎటువంటి సంచలనాలను నమోదు చేస్తుందో చూడాలి మరి .   

మరింత సమాచారం తెలుసుకోండి: