టాలీవుడ్  సినిమా పరిశ్రమలో ప్రస్తుతం యూత్ లో మంచి క్రేజ్ సంపాదించి సెన్సేషనల్ హీరోగా కొనసాగుతున్న విజయ్ దేవరకొండ, ఇటీవల వరుస ఫ్లాపులతో కొంత సతమతం అవుతున్నాడు. ప్రస్తుతం క్రాంతిమాధవ్ దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై ఒక సినిమాలో నటిస్తున్న విజయ్, అతి త్వరలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్లు ఇటీవల ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. 

పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్న ఆ సినిమాను అతి త్వరలో ప్రారంభించనున్నట్లు సమాచారం. కొద్దికాలంగా ఫ్లాపులతో కొట్టుమిట్టాడిన పూరి, ఇటీవల రామ్ తో తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఇచ్చిన జోష్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తుండడం, అదీకాక విజయ్ మరియు పూరి కాంబినేషన్లో రాబోతున్న ఫస్ట్ సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే హీరోగా తన డెబ్యూ మూవీ పెళ్లిచూపులు సినిమాను తెరకెక్కించిన తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో రూపొందబోయే సినిమాకు విజయ్ దేవరకొండ మొదటిసారి నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే మహానటి, సమ్మోహనం, ఫలక్నుమా దాస్ వంటి సినిమాల్లో నటుడుగా కూడా ప్రేక్షకులను మెప్పించిన తరుణ్ భాస్కర్, ఈ తాజా సినిమాలో కూడా ఒక విభిన్నమైన పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. 

అలానే ఈ సినిమాకు 'మీకుమాత్రమే చెప్తా' అనే టైటిల్ ని కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు దర్శకుడు, హీరోయిన్, ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు అతి త్వరలో వెల్లడికాబోతున్నట్లు చెప్తున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ న్యూస్ నిజమే అయితే మాత్రం, ఇప్పటివరకు హీరోగా ప్రేక్షకులను అలరించిన విజయ్ దేవరకొండ, ఇకపై నిర్మాతగా కూడా ప్రేక్షకులకు మరింతగా చేరువ అవుతారన్నమాట....!!

మరింత సమాచారం తెలుసుకోండి: