రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ సంస్థ నిర్మించిన కేజీఎఫ్ దేశమంతటా సంచలన విజయం సాధించింది.దాదాపు 50 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు 250 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్ 2 లో విలన్ పాత్ర లో ప్రముఖ బాలీవుడ్ నటుడు  సంజయ్ దత్ నటిస్తున్నాడు. . సంజయ్ దత్ వలన బాలీవుడ్ లో  కేజీఎఫ్ 2 సినిమా పై అంచనాలు మరింతగా పెరిగాయి.
రీసెంట్ గా సంజయ్ దత్ బర్త్ డే సందర్భంగా `కేజీఎప్ -చాప్టర్౨ లో  సంజయ్ దత్ పాత్ర "అధీరా"లుక్ ని విడుదల చేశారు.సంజయ్ దత్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అధీరా పాత్ర  పది మంది థానోస్ లతో సమానం అని అన్నాడు. సినిమాలో ఆయన పాత్ర అంత పవర్ ఫుల్ గా ఉంటుంది అన్న మాట. విలన్ అంత పవర్ ఫుల్ ఉంటే హీరో యశ్ పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో ఊహించగాలం. 

 ప్రస్తుతం కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లోని సైనైడ్ హిల్స్ ఏరియాలో  భారీ సెట్స్ ని నిర్మించి అందులో  యాక్షన్ సన్నివేశాలను చిత్రికరిస్తున్నారు.ఇక్కడ  సినిమా షూటింగ్ ఆపివేయలని రెండవ అదనపు సివిల్ మరియు JMFC కోర్టు ఆదేశాలు జారీచేసింది.

శ్రీనివాస్ అనే స్థానికుడు కేజీఎఫ్ టీమ్ పై కేసు ఫైల్ చేశాడు.ఈ ప్రాంతంలో భారీ సెట్లు వేయడం, యక్షన్ సీన్స్ తీయడం వలన ఇక్కడి పర్యావరణనికి నష్టం జరుగుతుందని ఆయన కోర్టులో తన వాదన వినిపించారు. అది విన్న కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ను ఇచ్చింది.దిన్ని సవాల్ చేస్తూ కేజీఎఫ్ టీమ్ కోర్టు ను ఆశ్రయించింది. కోర్టు తదుపరి విచారణ సెప్టెంబర్ 23 కు వాయిదా వేసింది. ఈ సినిమాని 2020 లో రిలీజ్ చేసేందుకు నిర్మాత విజయ్ కిరంగదుర్ సన్నాహాలు చేస్తున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: