పెళ్ళి చూపులు సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన హీరో విజయ్, అర్జున్ రెడ్డి ద్వారా స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. తన ఆటిట్యూడ్, యాక్టింగ్ తో యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం యూత్ లో విజయ్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే మొన్న వచ్చిన "డియర్ కామ్రేడ్" సినిమా పరాజయం కావడంతో విజయ్ కొంత తగ్గాడనే వార్తలు వస్తున్నాయి. అదలా ఉంచితే తాజా సమాచారం ప్రకారం విజయ్ నిర్మాతగా మారబోతున్నాడట!


హీరోగా సంపాదించిన దాంట్లోంచి తనకు నచ్చిన కథని ప్రొడ్యూస్ చేద్దామని డిసైడ్ అయ్యాడట. ఈ సినిమాకి సంబంధించి వివరాలు చాలా కొత్తగా తెలియజేసే ప్రయత్నం చేశారు. పెళ్ళి చూపులు సినిమాతో తెలుగు సినిమాల తీరును మార్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమాలో హీరోగా నటించనున్నాడట. దర్శకుడు హీరోగా మారడమన్నది చాలా అరుదు. నటనపరంగా తరుణ్ భాస్కర్ పర్ ఫార్మెన్స్ ఎలా ఉంటుందో "ఫలక్ నుమా దాస్" లో చూశాం.


తరుణ్ భాస్కర్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని విజయ్ దేవరకొండ నిరిస్తున్నాడు. తను ఇప్పటి వరకు దాచుకున్న సేవింగ్స్ మొత్తాన్ని ఇందులో పెదుతున్నానని విజయ్ చెప్పడం ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇక సినిమా పేరు మరింత ఇంట్రెస్టింగ్ గా పెట్టారు. "మీకు మాత్రమే చెప్తా" అనే క్యాచీ టైటిల్ ని ఖరారు చేశారు. మరి ఈ సినిమాకి దర్శకత్వం ఎవరనేది తెలియదు.ఈ సినిమాకి సంబంధించి మిగతా సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.


కొత్తదనం నిండిన సినిమాలను ప్రోత్సహించేందుకు సిద్ధమవుతున్న విజయ్ కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై యాంగ్ టాలెంట్ ప్రోత్సాహం అందించేందుకు తొలి అడుగు వేస్తున్నాడు. తన అభిరుచిని పరిచయం చేయబోతున్నాడు. పెళ్లి చూపులతో యూత్ లో బలమైన ముద్ర ను వేసుకున్న విజయ్ కి ఆ ప్రయాణంలో పడిన కష్టాలు తెలుసు. అందుకే కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారట.



మరింత సమాచారం తెలుసుకోండి: