బిగ్ బాస్ త్రీ లో ముప్పై ఎనిమిదివ రోజు ఉదయం షారుక్ ఖాన్ పాటతో అంతా నిద్ర లేచారు. మధ్యాహ్నం బాబా మాస్టర్ పడుకోవడంతో కుక్కల అరుపులు వినిపించాయి. శివజ్యోతి వచ్చి మాస్టర్ ఇంట్లో ఉంటారా, వెళ్లిపోతారా లేకపోతే నన్ను వెళ్లిపొమ్మంటారా ఇలా నిద్రపోవడం ఇది మూడోసారి అని అడిగింది. ఇప్పుడు బిగ్ బాస్ పనిష్మెంట్ టాస్క్ ఇవ్వాలి, నీ పని అవుతుందని చెప్పింది. ఈ వారం ఇంటి సభ్యులకు ఒప్పో రెనో టూ చలో ఇండియా టాస్క్ ఇస్తున్నట్లు బిగ్ బాస్ ప్రకటించాడు. ఈ టాస్క్ లో సభ్యులంతా గార్డన్ ఏరియాలోని ట్రైన్ లో ఇండియాలోని వివిధ ప్రదేశాలను సందర్శిస్తారని అన్నాడు. ట్రైన్ లోనే డ్రైవర్, కండక్టర్ ఒక్కో గమ్యస్థానం చేరే వరకు ట్రైన్ ని నడుపుతారని గమ్యస్థానం చేరుకున్నాక సభ్యులు కిందకి దిగి ఆ ప్రదేశాన్ని ఆస్వాదించాల్సి ఉంటుందని అన్నాడు.


బీపీ ట్రావెల్ ఓనర్ మేనేజర్ గా అలీ వ్యవహరిస్తాడని ఈ టూర్ విజయవంతమైతే అలీ పెళ్ళిచేసుకోవాలనే అనుకుంటూ ఉంటాడని చెప్పాడు. తల్లీ కూతుళ్లుగా శివజ్యోతి, వితిక తల్లి జ్యోతికి చాదస్తం ఎక్కువని కూతురు మాత్రం అల్లరి పిల్ల అని బిగ్ బాస్ చెప్పాడు. హనీమూన్ కపుల్ గా రవి, పునర్నవి ఇంటి నుంచి పారిపోయి లవ్ మ్యారేజ్ చేసుకున్నారని ప్రేమను వెతుక్కుంటూ టూర్ ని మొదలు పెట్టిన అందమైన అమ్మాయిగా శ్రీముఖి ఉంటుందనీ మేనేజర్ ఆమెకు ఎట్రాక్టివ్ గా కనిపించాడని వాళ్ళ కథ ఎక్కడి వరకు వెళ్తుందో చివర్లో తెలుస్తుందని బిగ్ బాస్ అన్నాడు. ఒక జంట హిమజ, మహేష్ వీళ్ల గొడవలకూ అంతే ఉండదని ట్రైన్ డ్రైవర్ కండక్టర్ లుగా రాహుల్ వరుణ్ ఉంటారని చెప్పాడు.


టూర్ లో ప్రయాణికులకు టీ, స్నాక్స్ ఆహార విషయాలనూ బాబా మాస్టర్ చూసుకుంటాడని మొత్తం ఆరు నగరాలను ప్రయాణికులు సందర్శిస్తారని అన్నాడు. ఆ ఆరు నగరాల్లో జరిగే టాస్క్ లో గెలిచిన వారికి లగ్జరీ బడ్జెట్ లో అదనంగా పాయింట్ లు లభిస్తాయని బిగ్ బాస్ చెప్పాడు. టూర్ లో మీ మెమరీలు క్యాప్చర్ చేసుకునే అవకాశం ఒప్పో రేనో తో లభిస్తుందని అన్నాడు. సార్ ఫస్ట్ నైట్ కి పాలు ఏమైనా కావాలా అని బాబా మాస్టర్ రవీని ఆటపట్టించాడు. అందరూ వచ్చి ట్రైన్ లో కూర్చున్నారు. మేనేజర్ అలీ వచ్చి అందరినీ పరిచయం చేసుకున్నాడు. శ్రీముఖి మాత్రం అలీ వెనకాలే తిరిగింది. శివజ్యోతి, శ్రీముఖితో మీ అమ్మా నాన్న నన్ను ఒక్కదాన్నే ఎలా పంపించారు. ఇంత చిన్న బట్టలు వేసి అని అడిగింది.


మధ్యలో వచ్చి కూర్చున్న అలీతో వితిక సినిమాల్లో నటిస్తారా మీరు అని అడిగింది. నేను ఫేమస్ హీరోయిన్ని అని చెప్పింది. రవి, పునర్నవి గురించి మిగతా వాళ్లు అడగ్గానే సిగ్గుపడుతూ పేర్లు చెప్పారు. లవ్ మ్యారేజ్ చేసుకుని హనీమూన్ కి వచ్చామని అన్నారు. మీ అందరినీ చూస్తుంటే నాకు త్వరగా పెళ్లి కావాలని కోరుకుంటున్నానని శ్రీముఖి అంది. మాటిమాటికీ ఎందుకొస్తున్నావంటూ కండెక్టర్ వరుణ్ తో హిమజ గొడవ పెట్టుకుంది. ఈ ట్రైనే మాది, మీరు ఉంటే ఉండండి లేకుంటే దిగిపోండి అని వరుణ్ అన్నాడు. ఇంతలో అలీ వచ్చి మహేష్ ని పాపం మీ జీవితం ఎప్పుడూ నాశనమైపోయినట్లు ఉంది సార్ అన్నాడు. హిమజ అలీతో మా ఆయనే నా మీద నోరు తెరవడు నువ్వేంటి అంటూ గొడవ పెట్టుకుంది.


తర్వాత సభ్యులంతా పాట పాడుతూ వుంటే రవి, పునర్నవి, మహేష్, హిమజ, అలీ, వితిక డ్యాన్స్ చేశారు. ట్రైన్ ఒక దగ్గర ఆగగానే బాబా మాస్టర్ అందరికీ టీ, మిర్చి స్నాక్స్ ని ఇచ్చాడు.  తర్వాత ట్రైన్ లో వాళ్లతో పాటు వెళ్తూ తన గురించి చెప్పాడు. నాకు ముగ్గురు పెళ్ళాలు ఆరుగురు పిల్లలు అని వాళ్ళ కోసమే ఇలా టీ అమ్ముతున్నానని అన్నాడు. శ్రీనగర్ రాగానే ట్రైన్ ఆగింది. బిగ్ బాస్ సభ్యులకు ఆపిల్ టాస్క్ ఇచ్చాడు. రెండు టీమ్ లుగా విడిపోయి ఒక్కో టీమ్ నుంచి ఒకరు వచ్చి కళ్లకు గంతలు కట్టుకుని కిందపడిన ఆపిల్స్ ని బుట్టలో వేయాలని ఎండ్ బజర్ మోగగానే ఎవరి బుట్టలో ఎక్కువ ఉంటే వాళ్లే విజేతలని చెప్పాడు. టాస్క్ లో జ్యోతి, బాబా టీమ్ లు గెలిచినట్లు అలీ బిగ్ బాస్ కు చెప్పాడు.


అందరూ కలిసి శ్రీ నగర్ లో ఒక సెల్ఫీ దిగారు. తరువాత రైలు బయలుదేరగానే వరుణ్ సందేశ్ మాట్లాడుతూ, నేను రవి వాళ్ల నాన్న దగ్గర పని చేసే వాడినని రెండేళ్ల క్రితం నేనే రవి, పునర్నవి ల పెళ్లి చేశానంటూ ఒక స్టోరీ చెప్పాడు. సభ్యులంతా సరదాగా ఒకరి పై ఒకరు జోక్స్ వేసుకున్నారు. నన్ను ఆంటీ అంటావా అంటూ జ్యోతితో హిమజ గొడవపడింది. రాత్రి ఒక దీపాన్ని చూపిస్తూ అలీ, శ్రీముఖి తో ఇది మన ప్రేమలాగే వెలుగుతూ ఆరిపోతూ వుంటుంది అన్నాడు. తరవాత చండీఘర్ వచ్చినట్లు ఎనౌన్స్ మెంట్ వచ్చింది. బిగ్ బాస్ ఇంటి సభ్యులకు బల్లే బల్లే లస్సీ టాస్క్ ఇచ్చాడుమ. ఇందులో రవి మహేష్ పోటీ పడ్డారు. ఎండ్ బజర్ మోగే వరకూ ఎవరు ఎక్కువ లస్సీ గ్లాసులు తాగుతారో వాళ్ళే విజేతలని బిగ్ బాస్ చెప్పాడు. చివరికి రవి నాలుగు గ్లాసుల లస్సీ తాగి విజేతగా నిలిచాడు. ఇలా బిగ్ బాస్ హౌస్ లో ముప్పై ఎనిమిది వ రోజు ముగిసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: