మూడేళ్లుగా హిట్ కోసం తపిస్తున్న డైరక్టర్ పూరి జగన్నాథ్. అలాంటి డైరక్టర్ తో ఇస్మార్ట్ శంకర్ అంటూ తీసి సూపర్ హిట్ అందుకున్నాడు హీరో రామ్. పూరి సినిమా హిట్టైతే ఎలా ఉంటుందో ఇస్మార్ట్ శంకర్ కలక్షన్స్ చూసి చెప్పొచ్చు. రామ్ కెరియర్ లో కూడా ఆ సినిమా ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. అయితే ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ ముందు ఒకటి రెండు కథలు విన్న రాం వాటిని వద్దనుకున్నాడట. 


ఇక తనకు ఇదవరకు అడ్వాన్సులు ఇచ్చిన నిర్మాతలకు తిరిగి డబ్బు ఇచ్చేశాడట. ఇస్మార్ట్ శంకర్ హిట్ తో తన సత్తా చాటుకున్న రామ్ ఇక మీద సబ్జెక్ట్స్ విషయంలో జాగ్రత్త వహించనున్నాడట. అందుకే ఫ్రెష్ గా కథల వేట మొదలు పెట్టాడట. ఇస్మార్ట్ శంకర్ హిట్ తో రామ్ తన రేంజ్ ఏంటన్నది తెలుసుకున్నాడు.  


సరైన కథ పడితే తనకు మంచి వసూళ్లు వస్తాయని తెలుసుకున్నాడు. అందుకే రామ్ ఇక మీదట ఫ్లాప్స్ లో ఉన్నా సరే స్టార్ డైరక్టర్స్ తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట. అయితే ఇప్పటికిప్పుడు స్టార్ డైరక్టర్ సినిమా అంటే కొంచం కష్టమే అయితే తన ఆస్థాన దర్శకుడు కిశోర్ తిరుమల సినిమా మాత్రం నెక్స్ట్ చేస్తాడని తెలుస్తుంది.


కిశోర్ తిరుమల డైరక్షన్ లో నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగి సినిమాలు చేశాడు రామ్. ఇప్పుడు ఇది హ్యాట్రిక్ మూవీ అవుతుంది. అయితే ఇస్మార్ట్ హిట్ కొట్టాడు కాబట్టి రాం తో ఈసారి కిశోర్ కూడా ప్రయోగాన్ని చేస్తున్నాడట. రీసెంట్ గా సాయి ధరం తేజ్ తో చిత్రలహరి హిట్ అందుకున్న కిశోర్ తిరుమల రామ్ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు. ఈ కాంబినేషన్ లో మూవీని స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్నారట. 


మరింత సమాచారం తెలుసుకోండి: