రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సాహో, రేపు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. బాహుబలి తరువాత ప్రభాస్ నటిస్తున్న సాంఘిక సినిమా కావడం, అలానే తొలిసారి బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ ఈ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అవుతూ ఉండడం, టాలీవుడ్, బాలీవుడ్ నుండి ఏకంగా ఐదుగురు మ్యూజిక్ డైరెక్టర్లు ఈ సినిమాకు మ్యూజిక్ అందించడం, అన్నిటికంటే ముఖ్యంగా దాదాపుగా రూ.350కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతూ ఉండడంతో ఈ సినిమాపై తారా స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. 

ఇక సినిమా రిలీజ్ కు నాలుగు రోజులు ముందు నుండే రెబల్ ఫ్యాన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్లెక్సీలతో తమ సినిమాకు హడావుడి మొదలెట్టేసారు. మరోవైపు ఈ సినిమా టికెట్స్ అన్ని ప్రాంతాల్లో హాట్ కేక్స్ లా అమ్ముడయ్యాయి. ఎపుడు తెల్లవారుతుందా, ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అనే ఆత్రుత అందరిలోనూ నెలకొని ఉంది. ఇకపోతే బాహుబలి సినిమా రెండు భాగాలతో తెలుగు సినిమా రేంజ్ ని దేశ, విదేశాలకు విస్తరింపచేసిన ప్రబాస్ నటిస్తున్న ఈ లేటెస్ట్ మూవీ సాహో మూవీ, తప్పకుండా మంచి సక్సెస్ సాధించి, 

టాలీవుడ్ ఖ్యాతిని మరింతగా పెంచాలని ఇప్పటికే పలువురు ఇతర హీరోల అభిమానులు కూడా రెబల్ స్టార్ కు అలానే సాహోకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. అలానే నేటి ఉదయం నుండి పలువురు సినిమా ప్రముఖులు కూడా వెల్లువలా సాహో విజయవంతం అవ్వాలని కోరుకుంటూ, తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ట్వీట్స్ చేస్తూ ముందస్తు అభినందనలతో నీరాజనాలు అందిస్తున్నారు. ఇక ఇప్పటికే సాహో క్రేజ్ ఊహకందని రేంజ్ కి చేరుకోవడంతో ఆ సినిమా యూనిట్ మాత్రం, తప్పకుండా రేపు తమ సినిమా విజయం తథ్యం అని ధీమా వ్యక్తం చేస్తోంది. మరి ఎన్నో అంచనాలతో రేపు ప్రేక్షకుల ముందుకు సాహో, ఆ అంచనాలు ఎంతవరకు అందుకుంటుందో చూడాలి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: