రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధ కపూర్ ల జోడీతో యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సాహో. ప్రభాస్ స్నేహితులు వంశి, ప్రమోద్ లు కలిసి దాదాపుగా రూ.350 కోట్ల భారీ బడ్జెట్ తో, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల రానుంది. అయితే ముందుగా ఈ సినిమా ప్రీమియర్ షో కాసేపటి క్రితం యుఏఈ లో నిర్వహించడం, అక్కడి నుండి సినిమా టాక్ రావడం జరిగిపోయాయి. ఇక సినిమా కథ విషయానికి వస్తే, ఈ  సినిమాను తండ్రి కొడుకుల మధ్య అనుబంధాన్ని తెలిపే ఒక మంచి పాయింట్ ని తీసుకుని దర్శకుడు తెరకెక్కించడం జరిగిందట. మొదట, హీరోని తప్పుగా అర్ధం చేసుకున్న హీరోయిన్, ఆ తరువాత కొన్ని ఘటనల వలన అతడు మంచివాడని తెలుసుకుని, అతడితో కలిసి ఒక పెద్ద రాబరీ వెనుక మిస్టరీని తెలుసుకునేందుకు ముందుకు సాగుతుందట. 

అయితే వారి వెతుకులాటలో మరికొన్ని ఊహించని పరిణామాలు ఎదురు కావడం, అలానే కొంత సినిమా తరువాత, హీరో తండ్రి గురించి తెలియడం, ఆపై మెల్లగా ఒక్కొక్కటిగా చిన్న ట్విస్టులు రివీల్ అవుతూ సినిమా సాగుతుందట. ఇక క్లైమాక్స్ సమయంలో వచ్చే మరొక అద్భుతమైన ట్విస్ట్ తో సినిమా ముగుస్తుందని సమాచారం. క్లుప్తంగా ఇదే సాహో సినిమా కథని అంటున్నారు. ఇక ఈ సినిమాలో హీరో ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్, ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్, ఇంటర్వెల్ ట్విస్ట్, సెకండ్ హాఫ్ మధ్యలో వచ్చే భారీ ఫైట్ సీన్, అలానే ప్రీ క్లైమాక్స్ ముందు జరిగే భారీ ఛేజింగ్ తో కూడిన యాక్షన్ సీన్, క్లైమాక్స్ ట్విస్ట్, మొత్తంగా ఇవే సినిమాలో ప్రధాన హైలైట్స్ గా చెప్తున్నారు. ఇక స్క్రీన్ పై ప్రభాస్, శ్రద్దల జోడి అదిరిపోయిందని, ఫైట్స్ మరియు యాక్షన్ సన్నివేశాలలో ప్రభాస్ మరొక్కసారి తన మార్క్ తో దూసుకెళ్లాడని అంటున్నారు. 

అంతేకాక సినిమాలో మధ్యలో వచ్చే సాంగ్స్ ఆడియన్స్ కి మంచి రిలీఫ్ నివ్వడంతో పాటు, కీలక యాక్షన్ సన్నివేశాల సమయంలో జీబ్రాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు వెన్నెముకగా నిలిచిందని చెప్తున్నారు. ఇక ఓవర్ అల్ గా ఈ సాహో సినిమా చూసిన తరువాత, బయటకు వచ్చిన ప్రేక్షకుడు అదరహో అని చెప్పడం ఖాయం అంటున్నారు. మరి ప్రస్తుతం యుఏఈ షో నుండి వస్తున్న ఈ పాజిటివ్ స్పందనను బట్టి చూస్తే, బాహుబలి, బాహుబలి 2 లతో అద్భుత విజయాలు సొంతం చేసుకున్న ప్రభాస్, ఈ సాహో సినిమా సూపర్ సక్సెస్ తో హ్యాట్రిక్ కొట్టినట్లే అని అంటున్నారు సినీ విశ్లేషకులు....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: