రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, సుజీత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన లేటెస్ట్ మూవీ సాహో. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటివరకు చూడని భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా, ఎన్నో అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక నిన్న రాత్రి యుఎఈ, యుఎస్ఎ లలో జరిగిన ప్రీమియర్ షోలకు వచ్చిన టాక్ ని బట్టి చూస్తుంటే, సాహో సినిమా మంచి సక్సెస్ఫుల్ టాక్ ని సంపాదించినట్లు తెలుస్తోంది. 2017లో వచ్చిన బాహుబలి 2 మూవీ తరువాత ఇప్పటివరకు ప్రభాస్ నుండి మరొక సినిమా రాకపోవడంతో, 

అప్పటినుండి ఆయన తదుపరి సినిమా కోసం ఫ్యాన్స్  ఎన్నో ఆశలతో ఎదురుచూడడం జరిగింది. వారి ఆశలు నెరవేరుస్తూ నేడు రిలీజ్ అయిన సాహో సినిమాలో భారీ స్థాయి యాక్షన్ సన్నివేశాలు, కళ్ళు చెదిరే విజువల్స్, ఛేజింగ్ సీన్స్, విజువల్ వండర్ గా తెరకెక్కిన సాంగ్స్, అలరించే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఊహకందని ట్విస్టులు, వెరసి సాహో ను హిట్ చేసాయి అంటున్నారు ప్రేక్షకులు. ఇకపోతే ఈ సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా తొలిసారి ఎంట్రీ ఇస్తున్న శ్రద్ధ కపూర్, తనకు ముంబై తరువాత హైదరాబాద్ ఎంతో నచ్చిందని, అలానే సాహో షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ విచ్చేసిన తనకు ఇక్కడి ప్రేక్షకుల అభిరుచి, వాతావరణం, మరియు పరిస్థితులు ఎంతో బాగా నచ్చాయని గతంలో చెప్పడం జరిగింది. అందుకే ప్రభాస్ గారితో కలిసి నటిస్తున్న ఈ భారీ మూవీ, హిందీతో పాటు తన డెబ్యూ మూవీగా తెలుగు సహా ఇతర సౌత్ భాషల్లో కూడా రిలీజ్ అవుతుండడంతో, తప్పకుండా మంచి సక్సెస్ సాధించి, 

సౌత్ ప్రేక్షకుల మన్ననలు పొందాలని కోరుకుందట. అయితే ఆమె ఊహించినట్లుగానే ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, ప్రస్తుతం సక్సెస్ టాక్ సంపాదించడంతో, ఇకపై తనకు హిందీతో పాటు సౌత్ లో కూడా మంచి అవకాశాలు వస్తాయని భావిస్తోందట. మరి ఈ అమ్మడు ఆశలు నెరవేరడంతో, ఆమె సన్నిహితులు కూడా శ్రద్ధను అభినందనలతో ముంచేస్తున్నారట. మరి శ్రద్ధ భావిస్తున్నట్లు ఇకపై ఆమెకు ఎంత మేర సౌత్ సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయో వేచి చూడాలి....!!   


మరింత సమాచారం తెలుసుకోండి: