వర్ధమాన నటి శ్రీరెడ్డి, కొన్నాళ్ల క్రితం టాలీవుడ్ లో సినిమా అవకాశాల కోసం వచ్చే అమ్మాయిలను కొందరు మేనేజర్లు మరియు కో ఆర్డినేటర్లు, వారిని అవకాశాల పేరుతో లొంగదీసుకుని, లైంగికంగా పలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఒకానొక సమయంలో మా అసోసియేషన్ ముందు అర్ధ నగ్న ప్రదర్శన చేసింది శ్రీరెడ్డి. అయితే ఆ తర్వాత మా యాజమాన్యం దిగిరావడం, కొన్నాళ్ల తరువాత ఆ వివాదం సర్దుమణగడం జరిగింది. అయితే ఆ తరువాత ఒక సందర్భంలో నటుడు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి, ఆయన ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన శ్రీరెడ్డి, 

ఇప్పటికీ కూడా తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా వారి పై విమర్శలు ఎక్కుపెడుతూనే ఉంది. ఇకపోతే నేడు విపరీతమైన అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాహో సినిమాకు చాలా వరకు నెగటివ్ టాక్ వస్తుండడంతో, ఆ టాక్ కు పవన్ ఫ్యాన్స్ కొంత వరకు కారణం అంటూ శ్రీరెడ్డి నేడు, తన సోషల్ మీడియా ఖాతాలో ఒక సంచలన పోస్ట్ పెట్టింది. పీకే ఫ్యాన్స్, మీరు మారరా ఏంటి, ఇప్పుడు ప్రభాస్ మూవీ మీద పడి ఏడుస్తున్నారు అంటూ ఆమె తన పోస్ట్ లో తెల్పడం జరిగింది. అయితే పవన్ ఫ్యాన్స్ మాత్రం ఆమె పోస్ట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గట్టిగా రిటార్ట్ ఇస్తున్నారు. 

నిజానికి శ్రీ రెడ్డి, సాహో సినిమా టాక్ విషయమై అలా పోస్ట్ పెట్టి ఉండకూడదని, ఎందుకంటే పవన్ సహా మిగతా హీరోల అభిమానులందరూ కూడా, భారత దేశ ఖ్యాతిని మరింత పెంచేలా తెరకెక్కిన సాహో సినిమా, మంచి సక్సెస్ సాధించి మన టాలీవుడ్ కు మరింత గొప్ప పేరు తీసుకురావాలనే కోరుకున్నారని, అయితే ఈ విధంగా ఒక్క కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ని టార్గెట్ చేస్తూ ఆమె పోస్ట్ చేయడం మాత్రం సరైనది కాదంటున్నారు సినీ విశ్లేషకులు. కాగా శ్రీరెడ్డి పెట్టిన ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది...!!


మరింత సమాచారం తెలుసుకోండి: