టాలీవుడ్ లో ఎనర్జిటిక్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో రామ్ పోతినేని.  దేవదాసు సినిమాతో హీరోగా పరిచయం అయిన రామ్ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించాడు.  నటుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్నా..సినిమాలు మాత్రం పెద్దగా కలిసిరాలేదు.  శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘రెడీ’ సినిమా ఒక్కటి బ్లాక్ బస్టర్ అందుకుంది.  ఆ తర్వాత రామ్ నటించిన ఏ సినిమా పెద్దగా హిట్ టాక్ తెచ్చుకోలేదు.

ఆ మద్య కీర్తి సురేష్ తో నటించిన ‘నేను శైలజ’ పరవాలేదు అనిపించినా..తర్వాత వచ్చిన సినిమాలు వరుసగా డిజాస్టర్స్ అయ్యాయి. దాంతో మంచి సక్సెస్ కోసం వెయ్యి కన్నులతో ఎదురు చూస్తున్న రామ్ కి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ‘ఇస్మార్ట్ శంకర్ ’తో మంచి కమర్షియల్ హిట్ అందించాడు.  ఆ సమయానికి పూరికి కూడా మంచి హిట్ అవసరం..ఎందుకంటే ‘టెంపర్’ మూవీ నుంచి పూరి కూడా దారుణమైన ఫ్లాప్స్ ఎదుర్కొంటున్నారు. ఈ ఇద్దరు కసితో తీసిన సినిమానే ‘ఇస్మార్ట్ శంకర్’. అనుకున్నట్టుగానే మంచి విజయాన్ని అందుకున్నారు. 

దాంతో ఈ మూవీ సిక్వెల్ కి ప్లాన్ చేశారు పూరి. అయితే ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత రామ్ తన తదుపరి మూవీస్ పై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమాకి ముందు ఓకే అనుకున్న కథలను .. ప్రాజెక్టులను కూడా ఆయన రద్దు చేసుకుంటున్నాడట. కథాకథనాల్లో కొత్తదనం ఉంటేనే అంగీకరించాలనే నిర్ణయానికి ఆయన వచ్చాడని అంటున్నారు.

మరోపక్క పూరి సీక్వెల్ విషయంలో చాలా స్పీడ్ ఉన్నారట..అందుకే ఈ సినిమా ఈ సీక్వెల్ కి 'డబుల్ ఇస్మార్ట్' అనే టైటిల్ ను కూడా పూరి ఖాయం చేసినట్లు టాలీవుడ్ టాక్. కాకపోతే రామ్ మాత్రం వరుసగా ఇలాంటి సినిమాలు తీస్తే తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరించరని..మొదట లవ్, ఫ్యామిలీ ఎంట్రటైన్ మెంట్ మూవీల్లో నటించిన తర్వాత డబుల్ ఇస్మార్ట్ కి ప్రిపేర్ కావాలని నిర్ణయించుకున్నట్లు టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: