ఎస్.ఎస్.రాజమౌళి-ప్రభాస్ మధ్య ఎంతటి సాన్నిహిత్యం ఉందో ఎవరు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రభాస్ కి ప్రపంచ స్థాయిలో గుర్తింపుని తెచ్చిపెట్టింది జక్కన్నే. ఇక రీసెంట్‌గా విడుదలైన సాహో రిజల్ట్ అందరికి కళ్ళముందు కనిపిస్తున్నా వీకెండ్ పుణ్యమా అని వసూళ్లు మంచి బాగానే ఉండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ కు ఒక పక్క ఆనందంగా ఉన్నప్పటికి మరోపక్క ఇంత గొప్ప విజువల్ ట్రీట్ కు ఇలాంటి రెస్పాన్స్ వచ్చిందే..? అనే బాధా రెండు ఒకేసారి కలుగుతున్నాయి. ఇదిలా ఉంచితే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కు ముఖ్య అతిధిగా వచ్చిన రాజమౌళి ఇప్పటిదాకా సాహో రిజల్ట్ కు సంబంధించి ఎలాంటి ట్వీట్ చేయలేదు. ట్రైలర్ ను షేర్ కూడా చేయలేదు. ఇప్పుడిది ఫిల్మ్ నగర్ లోనే కాదు ప్రభాస్ ఫ్యాన్స్ లోను బోలెడన్ని అనుమానాలకు అవకాశం కల్పిస్తోంది.

సుదీప్ నటించిన పెహల్వాన్ సినిమా గురించి కొద్దిరోజుల క్రితం ప్రస్తావించిన జక్కన్న ఇప్పుడు సాహో గురించి మాత్రం ఎందుకు మౌనంగా ఉన్నారు..? అనేది అందరికి కలుగుతున్న పెద్ద సందేహం. ఫిలిం నగర్ టాక్ ప్రకారం సాహో ఫైనల్ కట్ రాజమౌళి ఇంతకు ముందే చూశారట. కానీ అప్పటికే ఏ చిన్న మార్పు చేయలేని స్టేజి లో పనులన్నీ అయిపోవడంతో సైలెంట్ అయ్యారని గాసిప్ ఒకటి బాగా వినిపిస్తుంది. ఆ కారణంగానే సాహో గురించి ఏ ఒక్క ట్వీట్ కూడా చేయలేదని తాజా సమాచారం.

అందరూ కామెంట్స్ చేస్తున్న సినిమాను తానొక్కడినే పాజిటివ్ గా పొగిడితే లేనిపోని తలనొప్పులు వస్తాయని అనుకున్నారో... లేదా బాహుబలితో అనవసరమైన పోలికలు తెచ్చి నెటిజెన్లు విసిగిస్తారని భావించారో గాని మొత్తానికి జక్కన్న సోషల్ మీడియాలో సైలెంట్ గా ఉన్నా అదో న్యూస్ అయిపోతోంది. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కోసం విదేశాల్లో ఉన్న రాజమౌళికి సాహో గురించి తెలిసే అవకాశం లేదని జక్కన్న అభిమానులు అంటున్నా జియో సిగ్నల్ ఉంటే చాలు అడివిలో ఉన్నా కూడా ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకునే టెక్నాలజీ ఉన్న ట్రెండ్ లో అవన్ని వట్టి మాటలని అనుకోలేమా. ఏదేమైనా సాహో చాలా వరకు అందరిని నిరాశపరచిందనే మాట వాస్తవమని తెలుస్తూనే ఉంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: