టాలీవుడ్ లో వస్తున్న బిగ్ బాస్ 3 ఆరోవారం చాలా కోలాహలంగా నడిచింది. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లతో ఇంటి సభ్యుల మద్య పెద్ద గొడవ జరిగింది. వితికను టార్గెట్ చేసుకొని ఇంటి సభ్యులు ఆడుకున్నారు. ఒకదశలో ఆమె భర్త వరుణ్ సందేష్ కూడా రితికపై కాఫీ చల్లి తన కోపాని గురయ్యాడు. ఆ తర్వాగ ట్రైన్ ఎపిసోడ్, బాబా భాస్కర్ మూవీ డైరెక్షన్ రవికృష్ణ, అలి రజా హీరోవిలన్ గా అలరించారు. ఇక కెప్టెన్ టాస్క్ లో ఫిజికల్ కాంపిటీషన్ లో వరుణ్ సందేష్ నెగ్గి కెప్టెన్ అయ్యాడు. ఇలా వారం రోజులు హడావుడి, సందడి తో నడిచింది.
ఇక వారంతం శని, ఆదివారంల్లో కింగ్ నాగార్జున చేసే సందడి గురించి అందరికీ తెలిసిందే. అయితే నిన్న మాత్రం బిగ్ బాస్ హౌజ్ లో ట్విస్ట్ ఇచ్చారు. ప్రస్తుతం నాగార్జున తన పుట్టిన రోజు సందర్భంగా తన కుటుంబ సభ్యులతో స్పెయిన్ లో ఎంజాయ్ చేస్తున్నారు. దాంతో ఆయన ఈ వారం బిగ్ బాస్ హూస్టింగ్ చేయలేక పోయారు. ఆయన స్థానంలో నాని అనుకున్నప్పట్టికీ ప్రస్తుతం విదేశాల్లో ఉండటంతో అది కూడా కుదరలేదు. దాంతో నాగ్ ప్లేస్ లో రమ్యకృష్ణ ఎంట్రీ ఇచ్చింది. శివగామి లా బిగ్ బాస్ లోకి అడుగు పెట్టింది.
మొదట తాను ఎందుకు వచ్చానో ఆడియన్స్ కి వివరించింది. ఆ తర్వాత ఇంటి సభ్యులకు ఒక్కసారే సర్ ప్రైజ్ ఇచ్చింది. రమ్యకృష్ణను ఇంటి సభ్యులు ఒక్కసారే షాక్ తిన్నారు..తర్వాత నాగార్జున స్క్రీన్ లోకి ఎంట్రీ ఇచ్చి అందరికీ తాను స్పెయిన్ లో ఉన్నానని చెప్పాడు. తర్వాత ఇంటి సభ్యులు నాగార్జునకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత ఇంటి సభ్యులకు రమ్యకృష్ణ చిత్రమైన టాస్క్ ఇచ్చింది.
తాను చప్పట్లు కొడతానని అప్పుడు ఇద్దరు ఇంటి సభ్యులు మంచీ, చెడు వివరించాలని చెప్పింది. ఇక ఈ వారంలో పునర్నవి, హిమజ, మహేశ్ ఎలిమినేషన్ లో నామినేట్ అయ్యారన్న సంగతి తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో వస్తున్న ట్రెండ్స్ ప్రకారం, నాగ్ గైర్హాజరీలో ఈ వారం ఎలిమినేషన్ ఎపిసోడ్ ఉండదని తెలుస్తోంది. ఈ వారానికి ఎలిమినేషన్ ఉండదని, రమ్యకృష్ణ ద్వారా చెప్పిస్తూ, ఇప్పటికే నేడు ప్రసారం కావాల్సిన ఎపిసోడ్ ను చిత్రీకరించినట్టు సమాచారం. ఇక అసలు విషయం తెలియాలంటే, నేటి రాత్రి వరకూ ఆగక తప్పదు.