యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా గత ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన జైసింహా సినిమా, నందమూరి అభిమానుల మరియు సాధారణ ప్రేక్షకుల అంచనాలు అందుకోవడంలో చాలా వరకు సక్సెస్ అయింది. ఆ సమయంలో రిలీజ్ అయిన సినిమాల్లో ఎక్కువగా ప్రేక్షకులు జైసింహా కె పట్టం కట్టారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాను సికె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ నిర్మించడం జరిగింది. అయితే ప్రస్తుతం సేమ్ అదే కాంబినేషన్లో బాలయ్య కొత్త చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 

బాలయ్య సరసన సోనాల్ చౌహన్, వేదికలు హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాకు చిరంతన్ భట్ సంగీతాన్ని అందిస్తుండగా, సి రామ్ ప్రసాద్ ఫోటోగ్రఫీ ని అందిస్తున్నారు. ఇక ఇటీవల ఇందులో బాలయ్య వెరైటీ గెటప్ పోస్టర్ ని రిలీజ్ చేసిన సినిమా యూనిట్, రేపు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ సినిమాకు సంబంధించి రెండు సరికొత్త పోస్టర్స్ ని కూడా రిలీజ్ చేసింది. ఈ పోస్టర్లలో సోనాల్ చౌహన్ తో కలిసి బాలయ్య అదిరిపోయే గెటప్ ధరించి ఉండడం గమనించవచ్చు. అయితే ఈ సినిమాకు కథ రీత్యా రూలర్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి సమాచారం అందుతోంది. 

నిజానికి ఈ సినిమాకు రూలర్ అనే టైటిల్ పెట్టబోతున్నట్లు అప్పట్లో వార్తలు ప్రచారం అయినప్పటికీ, నేడు అది నిజమేననని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. కథా పరంగా ఒక పవర్ఫుల్ గ్యాంగ్ స్టర్ పాత్రలో బాలయ్య నటిస్తున్నారని, అందుకే ఈ సినిమాకు రూలర్ అనే పవర్ఫుల్ టైటిల్ సరిగ్గా సరిపోతుందని భావించి, యూనిట్ కూడా ఇదే టైటిల్ కి ఓటేయడం జరిగిందట. మరి నేడు టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియాలంటే మాత్రం ఆ సినిమా యూనిట్ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.......!! 


మరింత సమాచారం తెలుసుకోండి: