అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండకు స్టార్ క్రేజ్ వచ్చింది. అయితే ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన షాలిని పాండేకి మాత్రం పెద్దగా ఇమేజ్ రాలేదు. సినిమాలో లిప్ లాక్స్ తో ప్రేక్షకులను అలరించిన షాలిని ఆ తర్వాత తనకు తగిన అవకాశాలను అందుకోవడంలో సక్సెస్ అవలేదు. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వస్తున్న అమ్మడు సరైన ఛాన్స్ కోసం వెయిట్ చేస్తుంది.


ఇక లేటెస్ట్ గా అలాంటి క్రేజీ ఛాన్స్ షాలిని పాండేకి వచ్చినట్టు తెలుస్తుంది. ప్రముఖ బాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ తో షాలిని పాండే 3 వరుస సినిమాల అగ్రిమెంట్ చేసుకుందని తెలుస్తుంది. యశ్ రాజ్ ఫిలంస్ తో అగ్రిమెంట్ కూడా పూర్తయిందట. బాలీవుడ్ ఎంట్రీనే షాలిని అదరగొట్టబోతుంది.   


యశ్ రాజ్ ఫిలిమ్స్ రణ్ వీర్ సింగ్ తో చేస్తున్న జయేశ్ భాయ్ జోర్దార్ సినిమాలో హీరోయిన్ గా షాలిని పాండేని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. ఆ సినిమాలో ముందు సారా ఆలీ ఖాన్, అనన్యా పాండేలను తీసుకోవాలని అనుకున్నారు కాని అర్జున్ రెడ్డితో అలరించిన షాలిని పాండే బాలీవుడ్ లో అదరగొట్టేందుకు రెడీ అయ్యింది.    


బాలీవుడ్ లో వరుసగా మూడు సినిమాలు చేస్తున్న షాలిని అందులో ఒక సినిమా క్లిక్ అయినా అమ్మడు అక్కడ క్రేజ్ తెచ్చుకోవడం ఖాయం. రణ్ వీర్ సింగ్ తో జతకడుతుంది అంటే ఇప్పటికే బీ టౌన్ మిగతా దర్శక నిర్మాతలు కూడా షాలినితో సినిమా చేయాలని చూస్తున్నారట. మరి షాలిని పాండే బాలీవుడ్ ఎంట్రీ ఎలా ఉంటుంది. ఆమెకు అక్కడ ఎలాంటి క్రేజ్ వస్తుందో తెలియాలంటే ఆ సినిమాలు వస్తేనే కాని తెలుస్తుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: