'ఇస్మార్ట్ శంకర్'తో వరుస ప్లాపులకు చెక్ పెట్టేసి బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అందుకున్న రామ్ పోతినేని ప్రస్తుతం అయోమయంలో ఉన్నాడు. ఒకరకంగా చెప్పాలంటే రామ్ చేయబోయే సినిమాలకు 'ఇస్మార్ట్ శంకర్' గట్టి బ్రేక్ వేసింది. అందుకు కారణం ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడమే. ప్రతీ సినిమాకు కొంచెం టైం తీసుకుంటూ పక్కాగా ముందుకెళ్లే రామ్ 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత అయినా స్పీడ్ పెంచుతాడనుకుంటే మళ్లీ అదే గ్యాప్ మెంటైన్ చేస్తున్నాడు. 'ఇస్మార్ట్ శంకర్' విడుదలై 50 రోజులు కావొస్తున్నా ఇంతవరకూ నెక్స్ట్ సినిమాను స్టార్ట్ చేయలేక తికమక పడుతున్నాడు. 

వాస్తవంగా అయితే 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత వెంటనే 'తడం' అనే తమిళ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నాడు రామ్. కానీ 'ఇస్మార్ట్ శంకర్' సక్సెస్ మాస్ ఇమేజ్ ను ఒక రేంజ్ లో పెంచడంతో ఇప్పుడు అయోమయంలో పడ్డాడు. ప్రస్తుతానికి రామ్ తడం రీమేక్ ను పక్కనపెట్టేసి మరో కథను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడని తాజా సమాచారం. ముందుగా ఇంకో మాస్ కమర్షియల్ సినిమా చేసి ఆ తర్వాత రీమేక్ సినిమాను చేయాలని డిసైడ్ అయ్యాడట. త్వరలోనే మరో మాస్ సినిమాతో సెట్స్ పైకి వస్తాడని లేటెస్ట్ న్యూస్ బాగా వైరల్ అవుతోంది.

నిజానికి పూరి జగన్నాథ్ రామ్ ని ఊర మాస్ క్యారెక్టర్ లో ప్రెజెంట్ చేసి ఎవరెస్ట్ అంచులో కూర్చుబెట్టాడన్న విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు దాన్ని అందుకోవడం, ఆ సక్సస్ ని కాపాడుకోవడం మన రామ్ కి చాలా కష్టంగా మారింది. అందుకే ఎప్పటిలాగే సక్సెస్ వచ్చినా ఇస్మార్ట్ శంకర్ ని మైమరిపించేలా సబ్జెక్ట్ రెడీ చేయించుకుంటున్నాడని ఫిల్మ్ నగర్ నుంచి అందిన సమాచారం. రామ్ నెక్స్ట్ డైరెక్టర్ ఎవరన్నది తెలియదు కానీ నిర్మాణం మాత్రం స్రవంతి మూవీస్ లోనే ఉండనుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే కొంతమంది డైరెక్టర్స్ కోసం మాంచి మాస్ సబ్జెక్ట్స్ రెడి చేసే పనిలో బిజి బిజీగా ఉన్నారని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: