ఆ చిత్రం కోసం దాదాపు 2 సంవత్సరాలు కష్టపడ్డారు ... ఒక్కొక్క వీడియో ని విడుదల చేస్తూ ఆ సినిమా పై ఓ రేంజ్ లో అంచనాలను పెంచేశారు. ఇక ట్రైలర్ అయితే పీక్స్ లో ఉందంటూ అభిమానులు తెగ సంబర పడిపోయారు . తీరా ఆ చిత్రం విడుదలయ్యాక అభిమానుల అంచనాలని అందుకోలేక పోయింది ఇప్పటికే మీకు అర్ధం అయ్యే ఉంటుంది నేను ఏ సినిమా గురుంచి మాట్లాడ్తున్నానో ...తాజాగా విడుదలయిన ప్రభాస్ సాహో మూవీ గురుంచి .అబ్బో ఏ సినిమా క్రియేట్ చేసిన హైప్ మాములుదా .విడుదలవ్వక ముందే రికార్డులు సృష్టించింది .
బాహుబలి లాంటి ఇంటర్నేషనల్ హిట్ తర్వాత ప్రభాస్ చేస్తున్న మూవీ కావటం... 300 కోట్ల బడ్జెట్ ...భారీ తారాగణం ఈ సినిమాకి బాగా హైప్ క్రీట్ చేశాయి. కానీ విడుదల తర్వాత మాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది సాహో . మొదటి రోజు నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ ..తర్వాత మిక్స్డ్ టాక్ తో ముందుకు వెళ్తుంది సాహూ .కాగా సినిమా రివ్యూలు ఎలా ఉన్నపటికీ కలెక్షన్ల పరంగా సాహో మాత్రం ఎక్కడ తగ్గటం లేదు. ఇప్పటి వరకు 300 కోట్ల కలెక్షన్స్ వచ్చాయని సాహో టీం తెలిపింది . రెండు సంవత్సరాలు తర్వాత వస్తున్నా ప్రభాస్ సినిమా కావటంతో తెగ సంబరపడిపోయిన అభిమానులకి నెగిటివ్ టాక్ రావటం తో అభిమానులు కూడా బాగా హర్ట్ అయ్యారు .
ఈ నేపథ్యంలో సాహూ డైరెక్టర్ సుజిత్ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ బావోద్వేగపు పోస్ట్ పెట్టారు . నేను నా 17 సంవత్సరాల వయసులో మొదటి లఘు చిత్రం తీశాను . అప్పుడు నా దగ్గర మనీ లేదు ...టీం లేదు. కేవలం నాకు ఉన్నదల్లా నా ఫామిలీ సపోర్ట్ ...ఆ లఘు చిత్రానికి కెమెరా ఎడిటింగ్ అన్ని నేనే చేసాను. ఎన్నో ఒడిదుడుకులు ఎదురుకున్నాను కానీ సాదించాలనుకున్నది మాత్రం వదిలి పెట్టలేదు. విమర్శలు నాకు ప్రోత్సాహాన్ని అందిస్తాయి ...మరో సారి తప్పు రిపీట్ చేయకుండా పాఠం నేర్పిస్తాయి .తాజాగా విడుదలైన సాహో సినిమాని చాలా మంది చూసారు . కొంత చాలా ఎక్స్పెక్ట్ చేశారు. కొంత మంది సినిమా చూసి సంతోషించారు .ఒకవేళ సినిమాలో మీరు ఏదైనా మిస్ అయితే మరో సారి సినిమాని చూడండి మీకు కావాల్సింది తప్పకుండ దొరుకుతుంది అంటూ పోస్ట్ పెట్టాడు సుజిత్. కాగా సుజిత్ పోస్ట్ సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి