డెబ్యూ డైరెక్టర్ నుండి స్టార్ డైరెక్టర్ వరకు ఏ డైరెక్టరైనా కథ మీద, స్క్రీన్ ప్లే మీద క్లారిటీ చాలా అవసరం. తాను చెప్పాలనుకున్న కథ రాసుకున్న విధానం స్పష్టంగా ఉంటే ఏ వర్గం ప్రేక్షకుడైనా ఈజీగా కనెక్ట్ అవుతాడు. అలా కాకుండా తన మేధావితనం మొత్తం తెరమీద చూపించేసి అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి ఖచ్చితంగా అర్థమవుతుంది అని చెప్పడం ప్రేక్షకుల అవగాహనా శక్తిని తక్కువ అంచనా వేయడమే. ఇది నిజంగా ప్రేక్షకులను తక్కువ చేసి మాట్లాడటమే.. ఒకరకంగా అవమానించినట్లు కూడా.  సాహో దర్శకుడు సుజిత్ ఇప్పుడు అదే చేన్నాడు. అంతటా నెగటివ్ టాక్ తెచ్చుకున్న సాహో వీకెండ్ హాలిడేస్ పుణ్యమా అని కాస్త వసూళ్లను నమోదు చేస్తోంది. కానీ ఆశించిన రేంజ్ లో టాక్ మాత్రం పాజిటివ్ గా మారడం లేదు. ఇది అన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్న ఫలితమే.

ప్రేక్షకుల ఎక్స్ పెక్టేషన్స్ కు తగ్గట్టు కథను మలచడంలో సుజిత్ ఫెయిల్ అయ్యాడని సోషల్ మీడియాలో చాలా కామెంట్స్ వచ్చాయి. కానీ సుజిత్ మాత్రం అలాంటిదేమి లేదన్న తరహాలో ట్వీట్ చేస్తున్నాడు. కొంత ఎమోషన్ గా ఫీలయి ట్వీట్ లో.. షార్ట్ ఫిలింస్ తీసే స్థాయి నుంచి ఇంత పెద్ద స్టార్ కాన్వాస్ ఉన్న సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో టేకప్ చేయడం దాకా తన ప్రయాణం గొప్పగా సాగిందని ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎక్కడా ఆగలేదని చెప్పుకున్నాడు. 

అంతే కాదు సాహో నుంచి చాలా ఆశించారని మరోసారి సినిమా చూస్తే అనుమానాలు తొలగిపోయి ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పాడు. అంటే మొదటిసారి చూసి బాలేదు లేదా అర్థం కాలేదు అని చెప్పిన వాళ్ళు అమాయకులనా...లేక పిచ్చోళ్ళా..? ఫస్ట్ టైం చూసి ప్రేక్షకుడిని మెప్పించినప్పుడే వద్దన్నా రెండోసారి చూస్తాడు. అలాంటిది ఒకసారి చాలు దేవుడో అన్న వాళ్ళను ఇంకోసారి చూస్తే బాగుంటుంది అని చెప్పడం ఏమిటోనని చాలా మంది పేదవి విరుస్తున్నారు. అంతేకాదు ఒకసారి చూస్తే అసలేమి అర్థం కాక పిచ్చెక్కింది..ఇంకోసారి గనక మళ్ళీ థియోటర్ కి వెళితే అటునుంచి అటే పిచ్చాసుపత్రికి వెళ్ళాలని అనుకుంటున్నారు.. సుజీత్ ట్వీట్ చూసిన వాళ్ళంతా..?    



మరింత సమాచారం తెలుసుకోండి: