తెలుగు స్టార్ నిర్మాత దిల్ రాజు  బాలీవుడ్ లో అడుగు పెట్టనున్నాడు.మోగా ప్రోడ్యూసర్ అల్లు అరవింద్ తో కలిసి తెలుగులో సమ్మర్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమా జెర్సీ ని హిందీలో రిమోక్ చేయనున్నారు. జెర్సీ సినిమాకు గౌతమ్  దర్శకత్వం వహించాడు.జెర్సీ లో నాచురల్ స్టార్ నాని మరియు కన్నడ భామ శ్రద్ధ శ్రీనాథ్ లు హీరో-హీరోయిన్ లుగా నటించారు.
 
జెర్సీ సినిమా క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో  ఇద్దరు తండ్రి కోడుకుల మధ్య జరిగే ఎమోషనల్ కథ. అర్జున్ కోడుకు తన పుట్టిన రోజుకు కానుకగా క్రికెట్ జెర్సి కొనివ్వమని అడుగుతాడు  కానీ హీరో దగ్గర  జెర్సి కోనడానికి   డబ్బులు ఉండావు. తన కోడుకు కూడా తనని ఒక లూసర్ గా చుడటం ఇష్టం లేక. తన కోడుకు తనను ఎప్పుడు హీరోగా చూడలని తన ప్రాణాలు పోతాయని తెలిసి కూడా మళ్ళి క్రికెట్ ఆడటం మొదలు పెట్టి చివరకి ఇండియాన్ టీం కి సెలక్ట అవుతాడు..ఈ సినిమాల్లో నాని అద్భుతంగా నటించాడు. తండ్రి-కోడుకల మధ్య వచ్చే ప్రతీ సన్నివేశం ప్రేక్షకుని మనసును తాకుతుంది. 


ఈ సినిమా  కోసం బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ ని సంప్రాదించారు.ఈ సినిమాలో నటించాడనికి ఓప్పుకున్నట్టు సమాచరం రీసెంట్ గా   అర్జున్ రెడ్డి  ని హిందీ లో కబీర్ సింగ్ గా రిమోక్ చేసి తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు.. .అయితే షాహిద్ కపూర్ కూడా సల్మాన్ ఖాన్ లనే హిట్ ల కోసం తెలుగు సినిమాల వైపు మొగ్గు చూపుతున్నాడు.ఈ సినిమా హీరోయిన్ గా రష్మిక మందనను ఓకే చేశారంట.బాలీవుడ్ డెబ్యూ కు మంచి అవకాశం దొరకడం తో ఆమె చాలా అనందంగా ఉందంట.ఈ సినిమాకు సంబంధించిన మిగతా విషయలు తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: