భారీ అంచనాల మధ్య విడుదలైన ‘సాహో’ సినిమా సౌత్ ఇండస్ట్రీ లో దారుణమైన ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ప్రభాస్ ప్రక్కన హీరోయిన్ గా శ్రద్ధా కపూర్ నటించడంతో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో శ్రద్ధా కపూర్ పేరు కూడా మారుమ్రోగుతోంది. సినిమా విడుదల కాకముందే ప్రమోషన్ కార్యక్రమాలలో శ్రద్ధా కపూర్ ప్రభాస్ తో సౌత్ లో మొత్తం ఉన్న అన్ని ఇండస్ట్రీలలో పాల్గొంది. సినిమా విడుదల కాకముందే చాలా చానల్స్ లోను మరియు లైవ్ షో లో పాల్గొని నాన్ స్టాప్ గా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న శ్రద్ధాకపూర్ కి రెస్ట్ లేకపోయింది.


అయితే సినిమా బాలీవుడ్లో మంచి టాక్ సొంతం చేసుకోవడంతో ఫుల్ హ్యాపీగా శ్రద్ధ కపూర్ ఉంది. ఇటువంటి క్రమంలో శ్రద్ధా కపూర్ సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌తో కలసి నటించిన 'చిచ్చోరే' చిత్రం ఈనెల 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రమోషన్స్  చేయాల్సిన పరిస్దితి వచ్చింది. దాంతో సాహో డ్యూటీ దిగగానే అదే ఛానెల్స్, అదే టాక్ షో లు, అదే డాన్స్ బేసెడ్ పోగ్రామ్ లలో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా నిర్మాతలు కోరడంతో నావల్ల కాదు అంటు కొంచెం టైం తీసుకుని పాల్గొంటానని సాహో సినిమా హీరోయిన్ శ్రద్ధ కపూర్ 'చిచ్చోరే' నిర్మాతలతో అన్నట్టు టాక్.


'చిచ్చోరే' ఈ నెల ఆరవ తారీకున విడుదల కానుంది. చిచ్చోరే మూవీ వాస్తవానికి ఆగస్ట్ 30వ తేదీ రిలీజ్ కావాల్సింది, సేమ్ డేట్ లో సాహో మూవీ రిలీజ్ కావడం తో ఆ మూవీ రిలీజ్ సెప్టెంబర్ 6వ తేదీ కి పోస్ట్ పోన్ అయింది. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించిన రెండు మూవీస్ సాహో , చిచ్చోరే ఒక వారం గ్యాప్ లో రిలీజ్ కావడం తో శ్రద్ధా కపూర్ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: