టాలీవుడ్ లో శివ సినిమాతో విలనీజానికే కొత్త భాష్యం చెప్పాడు.. మనీ సినిమాతో కామేడీ కి ఓ ట్రెండ్ సెట్ చేశాడు..ఇక హర్రర్ విషయానికి వస్తే ఆయన ఒక బ్రాండ్ గా తయారయ్యాడు. ఇంతకీ ఎవరా అనుకుంటున్నారా..ఇంకెవరు సంచలన దర్శకులు రాంగోపాల్ వర్మ.  కెరీర్ బిగినింగ్ లో ఆయన సినిమాలంటే పిచ్చిగా చూసేవారు..కానీ ఒకేమూస పద్దతి కొనసాగించడంతో వర్మపై మూవీస్ పై ఆడియన్స్ కి బోర్ కొట్టింది. దాంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తనదైన ముద్ర వేశారు. 

బాలీవుడ్ లో హర్రర్, మాఫియా తరహా సినిమాలు తీసి తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకున్నారు రాంగోపాల్ వర్మ.  అయితే అక్కడ కూడా వరుస ఫ్లాపులు రావడంతో తిరిగి టాలీవుడ్ లోకి వచ్చి కొన్ని సినిమాలు తీశారు.  కానీ ఆయన తీసిన ఒక్క సినిమా హిట్ కాలేదు. ఇటీవల ఏపిలో ఎన్నికల జరిగిన విషయం తెలిసిందే.  ఈ ఎన్నికల ముందు వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ తీశారు.  ఈ మూవీలో చంద్రబాబు ని వెన్నుపోటు అంశాన్ని ప్రస్తావించాడు.  అయితే దీనిపై రగిలిపోయిన టీడీపీ నేతలు మూవీని ఎన్నికలు అయ్యే వరకు ఆపేశారు. 

కాకపోతే ఇతర రాష్ట్రాల్లో ఈ మూవీ రిలీజ్ కావడం..చంద్రబాబు కి ఎంత డ్యామేజ్ కావాలో అవడం జరిగిపోయింది.  ఈ మూవి మంచి సక్సెస్ అందుకోవడంతో ఇప్పుడు మరో సినిమాకు సిద్దమయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో తాజా రాజకీయ పరిస్థితులపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పాత్రధారులను కూడా చూచాయగా చూపించారు. ఈ క్రమంలో తాజాగా ఈ రోజు సినిమాకు సంబంధించిన ‘ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్’ను వర్మ విడుదల చేశారు. ఈ వీడియోను మీరూ చూసేయండి.


మరింత సమాచారం తెలుసుకోండి: