టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక సినిమాలు లేని సమయంలో ఎక్కువగా తన కుటుంబానికి ప్రాధాన్యతనిచ్చే బన్నీ, వారితో కలిసి విహార యాత్రలకు వెళ్లడం, సరదాగా గడపడం వంటివాటికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తుంటారు. అలానే ఏవైనా ఫంక్షన్లకు మరియు శుభకార్యాలకు కుటుంబ సమేతంగా హాజరయ్యే బన్నీ, 

నేడు వినాయక చవితి ఆఖరి రోజు పండుగ వేడుకలను, తమ సొంత సంస్థైన గీత ఆర్ట్స్ ఆఫీస్ లో కుటుంబ సభ్యులు మరియు ఆఫీస్ స్టాఫ్ సమక్షంలో బన్నీ ఎంతో వైభవంగా జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకలకు ఆయన తండ్రి అల్లు అరవింద్, బన్నీ వాసు, మరియు ఇతర కుటుంబ సభ్యులు హాజరు కావడం జరిగింది. ఇక పండుగ సందర్భంగా వారు ప్రత్యేకంగా తయారు చేయించిన లడ్డును, మరియు ఇతర ప్రసాదాలను కూడా బన్నీ కుటుంబ సభ్యులు ఆనందంతో పంచుకున్నారు. ఇక నేడు ఈ వేడుకతో గీత ఆర్ట్స్ ఆఫీస్ మొత్తం ఎంతో సందడిగా మారినట్లు తెలుస్తోంది.

బన్నీ ఫ్యామిలీ మొత్తం ఎంతో ఆనందంతో జరుపుకున్న ఈ వేడుక ఫోటోలు ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే బన్నీ ఫ్యామిలీతో పాటుగా మెగాస్టార్ సతీమణి సురేఖ గారు కూడా ఈ వేడుకల్లో పాలు పంచుకున్న ఫోటోలు కూడా అందులో ఉన్నాయి. కాగా పలువురు మెగా ఫ్యాన్స్, వీటిని తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా షేర్స్, లైక్స్ చేస్తూ విపరీతంగా వైరల్ చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన డీజే, నా పేరు సూర్య వంటి సినిమాలతో కొంత ఢీలా పడ్డ స్టైలిష్ స్టార్, సంక్రాంతికి రాబోయే అల వైకుంఠపురములో సినిమాతో అయినా విజయాన్ని అందుకుని తమ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తారో లేదో చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: