నందినీ రెడ్డి గురించి తెలియని వాళ్ళుండరు. తీసింది తక్కువ సినిమాలే అయినా ఇండస్ట్రీలో మంచి గుర్తింపే తెచ్చుకుంది. అందుకు ముఖ్య కారణం లేడి డైరెక్టర్ అవడమే. ఇక సమంత తో తెరకెక్కించిన ఓ బేబి మంచి సక్సస్ ను అందుకుంది. అయితే ఈ సినిమా తర్వాత నందిని రెడ్డి మళ్ళీ ఎలాంటి సినిమాకు దర్శకత్వం వహిస్తుందోనని అందరు ఎదురు చూస్తున్నారు. ఇక వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన సంస్థ వైజయంతీ మూవీస్. జానర్ ఏదయినా, ఈ సంస్థ నుంచి వచ్చే చిన్న, మీడియం సినిమాలు అన్నీ వైవిధ్యంగానే వుంటూ వస్తున్నాయి. ఇప్పుడు ఇదే సంస్థ మరో సినిమాకు ప్లాన్ చేస్తోందని తాజా సమాచారం. ఇటీవలే ఓ బేబీ సినిమాతో సక్సెస్ కొట్టిన నందినీ రెడ్డి డైరక్షన్ లో ఓ సినిమాను ఈ ఇయర్ ఎండింగ్ లో ప్రారంభించబోతోంది వైజయంతీ మూవీస్.  

అయితే పాత పద్దతిలో హీరోను లాక్ చేసి, కథ అల్లడం కాకుండా, ఓ మాంచి లైన్ ను అనుకుని, దాని ప్రకారం స్క్రిప్ట్ వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారట. స్క్రిప్ట్ ఫుల్ గా రెడీ, డైలాగ్ వెర్షన్ తో సహా అనుకున్నపుడు, ఆ టైమ్ కు కథకు సూటయ్యే హీరో ఎవరు వుంటే వాళ్లతోనే చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇలాచేస్తే సినిమా ఆలస్యం కాకుండా, వెంటనే స్టార్ట్ చేసి ఫినిష్ చేసే అవకాశం వుంటుందని నిర్మాతలు, దర్శకురాలు పక్కాగా ప్లాన్ చేస్తున్నారట.

నవంబర్ నుంచి డేట్ లు ఇవ్వగలిగే సూటబుల్ హీరో ఎవరు వుంటే వాళ్లతో సినిమా స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం నందినీరెడ్డి నెట్ ఫ్లిక్స్ కోసం వేరే దర్శకులతో కలిసి ఓ ప్రాజెక్టు చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ పూర్తికాగానే ఈ సినిమా స్టార్ట్ అవుతుందని లేటేస్ట్ అప్‌డేట్. ఓ బేబి తర్వాత మళ్ళీ నందినీ రెడ్డి నుంచి వస్తున్న సినిమా అనగానే ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. అందులోను ప్రతిష్ఠాత్మకమైన వైజయంతి సంస్థ నిర్మించే సినిమా కాబట్టి ఇంకా ప్రాజెక్ట్ మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: