సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు అజయ్ కృష్ణ అనే మిలిటరీ మేజర్ పాత్రలో నటిస్తున్నారు. సీనియర్ నటి విజయశాంతి ఈ సినిమా ద్వారా టాలీవుడ్ కి నటిగా రీఎంట్రీ ఇస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా తరువాత మహేష్ నటించబోయే 27వ సినిమా గురించి  కొద్దిరోజులుగా పలు వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. 

కొందరేమో ఆయన పరశురామ్ తో చేస్తున్నారు అంటుంటే, మరికొందరేమో అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తో చేస్తున్నారు అంటూ వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఇకపోతే మహేష్ 27వ సినిమా విషయమై కాసేపటి క్రితం టాలీవుడ్ వర్గాల నుండి ఒక వార్త వెలువడుతోంది. నిన్న మధ్యాహ్నం ప్రాంతంలో మహేష్ బాబును కెజిఎఫ్ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ కలిసినట్లుగా వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ వచ్చిన అనంతరం మహేష్ ఇంటికి చేరుకున్న ప్రశాంత్, ఆయనతో కలిసి దాదాపుగా రెండు గంటలు గడిపారని అంటున్నారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య ఒక సినిమా కథకు సంబంధించి డిస్కషన్ జరిగినట్లు చెప్తున్నారు. అంతేకాదు ఆ సమయంలో ప్రశాంత్ చెప్పిన కథ మహేష్ కు విపరీతంగా నచ్చిందని, 

అతి త్వరలో పూర్తి స్క్రిప్ట్ తో వస్తే వీలైనంత త్వరగా సినిమా మొదలెడదాం అని మహేష్ మాటిచ్చినట్లు సమాచారం. నిజానికి ఇటీవల మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన నవీన్ ఎర్నేని ఒక మీడియా ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, తాము కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో రాబోయే రోజుల్లో ఒక సినిమా చేయనున్నాం అని చెప్పడం జరిగింది. దానిని బట్టి మహేష్ తో ప్రశాంత్ నీల్ చేయబోయే సినిమా వారి బ్యానర్ లోనే ఉండనున్నట్లు సమాచారం. ఇక మొత్తంగా ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజం అయితే, సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఇది నిజంగా అతి పెద్ద పండుగ న్యూసే అని చెప్పవచ్చు....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: