సూపర్ స్టార్ మహేష్ అనీల్ రావిపుడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. దిల్ రాజు, అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో విజయశాంతి స్పెషల్ రోల్ లో నటిస్తున్నారని తెలిసిందే. అయితే సరిలేరు నీకెవ్వరు సినిమా మహేష్ చేస్తున్న అతడు సినిమాకు దగ్గరగా ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్.   


త్రివిక్రం డైరక్షన్ లో వచ్చిన అతడు సినిమాలో ప్రొఫెషనల్ కిల్లర్ అయిన హీరో పార్ధులా ఓ ఫ్యామిలీ దగ్గరకు వెళ్లడం లాంటి కథతో మొదలవుతుంది. ఇక సరిలేరు నీకెవ్వరు సినిమాలో కూడా హీరో అజయ్ కృష్ణ మరో అజయ్ ప్లేస్ లో తన ఇంటికి వెళ్తాడట. అయితే అజయ్ కృష్ణగా హీరో అజయ్ ప్లేస్ లో ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అన్నది సినిమా కథ.


రెండు సినిమాల లైన్ సేం గా ఉంది. ఈ సినిమాలో అజయ్ గా సత్యదేవ్ నటిస్తున్నాడట. అతడు కథలా అనిపిస్తున్నా అనీల్ రావిపుడి మార్క్ కామెడీ ఉంటుంది కాబట్టి సినిమా తప్పకుండా బాక్సాఫీస్ పై సత్తా చాటుతుందని అంటున్నారు. అనీల్ డైరక్షన్.. సినిమా అవుట్ పుట్ పై మహేష్ పూర్తి కాన్ ఫిడెంట్ గా ఉన్నాడట.


2020 సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో మహేష్ హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. పటాస్ నుండి ఎఫ్-2 వరకు వరుస హిట్లతో మంచి ఫాంలో ఉన్న అనీల్ రావిపుడి సరిలేరు నీకెవ్వరు సినిమాతో సత్తా చాటుతాడని చెప్పొచ్చు. సంక్రాంతికి పోటీగా అల్లు అర్జున్ కూడా అల వైకుంఠపురములో సినిమాతో వస్తున్నాడని తెలుస్తుంది. మరి ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఎలా ఉండబోతుందో చూడాలి.  సంక్రాంతి సీజన్ కాబట్టి రెండు సినిమాలు బాక్సాఫీస్ హిట్ గా నిలిచే అవకాశాలు కూడా ఉన్నాయి.      



మరింత సమాచారం తెలుసుకోండి: