‘కుమారి 21ఎఫ్’ సినిమాతో.. ఒక్కసారిగా.. యూత్‌ని తనవైపుకు తిప్పుకున్న హాట్ బ్యూటీ.. హెబ్బా పటేల్. హెబ్బా పటేల్ ఇప్పుడు విలన్‌గా మారనుంది. ఇప్పటి వరకు తన అందాలతో గ్లామర్ పంట పండించిన హెబ్బా పటేల్.. హీరోయిన్‌గా అందరి మతులు పోగొట్టింది. ఈ సినిమా హిట్‌ తర్వాత.. వరుస సినిమాలు.. ఆమె చుట్టూ క్యూ కట్టాయి. ఇప్పటికి 10 సినిమాలు చేసినా.. ‘కుమారి 21ఎఫ్’ సినిమాకి వచ్చినంత మంచి టాక్‌.. ఏ సినిమాకీ రాలేదు. ఈ నేపథ్యంలో.. ఆమెకు నితిన్‌ సినిమాలో ఓ మంచి అవకాశం వచ్చింది. అదే నితిన్ ‘భీష్మ’ సినిమా.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ విలన్‌గా అవతారం ఎత్తేందుకు సిద్ధమవుతోందట. గ్లామర్ పాత్రలతో బోర్ కొట్టిందేమో అందుకే కొత్తగా విలన్ పాత్రలను ట్రై చేస్తోంది హెబ్బా పటేల్. కుమారి 21ఎఫ్ సినిమాతో తెరంగేట్రం చేసిన హెబ్బా పటేల్.. నితిన్‌ భీష్మలో నటిస్తోంది. నితిన్ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ నటిస్తోంది. ఈ సినిమాకి వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోంది.

 

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకొంటోంది. మొదట 'భీష్మ'ను దసరాకి విడుదల చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కానీ అనివార్య కారణాల ఈ సినిమా డిసెంబరులో విడుదల కానుంది. ఇక ఈ చిత్రంలోనే ‘హెబ్బా పటేల్’ విలన్‌గా కనిపించనుందని సమాచారం. ఈ సినిమాలో లేడీ విలన్ పాత్ర కీలకంగా ఉంటుందట. ఈ పాత్రలో హెబ్బా పటేల్ అయితే బాగుంటుందని భావించి ఆమెను సంప్రదిస్తే వెంటనే ఓకే చెప్పేసిందట. హెబ్బా పాత్రలో నెగటివ్‌ షేడ్స్‌ ఉంటాయని, తానే ఈ సినిమాలో లేడీ విలన్‌ అని టాక్ వస్తోంది. అదే గనుక జరిగితే ఆమె ఖాతాలో హిట్ పడుతుందని ఆమె ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: