సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన "అర్జున్ రెడ్డి" సినిమా తెలుగులో సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమాకి వచ్చిన క్రేజ్ తో హిందీలో అర్జున్ రెడ్డి రీమేక్ కు దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. బాలీవుడ్ చాక్లెట్ బాయ్ షాహిద్ కపూర్ మరియు కియారా అద్వాని లు జంటగా నటించిన కబీర్ సింగ్ సినిమా హిందీలో కూడా సూపర్ హిట్ అయ్యింది.ఈ సినిమా దాదాపు 300 కోట్లు వసూలు చేసి 2019 లో హిందీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది.


హిందీలో కబీర్ సింగ్ సినిమాకి విమర్శలు చాలా వచ్చాయి. చాలా మంది బాలీవుడ్ మూవీ క్రిటిక్స్  సినిమాకి దారుణమైన రివ్యూస్ ఇచ్చారు. .ఆ విమర్శల పైన మరియు బాలీవుడ్ మూవీ క్రిటిక్స్ పైన సందీప్ రెడ్డి కూడా చాలా ఘాటుగా స్పందించారు. తెలుగులో విమర్శలు వచ్చాయి కానీ అవి హెల్తీ విమర్శలని అని ఆయన అన్నారు.


అర్జున్ రెడ్డి తరువాత సందీప్ రెడ్డి కి తెలుగులో చాలా ఆఫర్స్ వచ్చాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు  సినిమా అవకాశం ఇచ్చారు.సందీప్ రెడ్డి  ప్రస్తుతం ఒక క్రైమ్ థ్రిల్లర్ స్ర్కిప్ట్ పైన వర్క్ చేస్తున్నారు. ఆ సినిమాను బాలీవుడ్ లో తెరకెక్కించాలని అనుకుంటున్నాడు. బాలీవుడ్ లో అయితే ఎక్కువ మంది ఆడియన్స్ ని రీచ్ అవ్వోచ్చని ఆయన ఆలోచన.


కబీర్ సింగ్ ప్రొడ్యూసర్స్ సందీప్ రెడ్డి కి మైండ్ బ్లోయింగ్ ఆఫర్ ఇచ్చారంట. కొత్త సినిమా లాభాల్లో 50% షేర్ సందీప్ రెడ్డి కి ఆఫర్  చేశారని. అయితే ఈ సినిమాని వారితో కలిసి సందీప్ భద్రకాళి బ్యానర్ పైన నిర్మించాలని అనుకుంటున్నాడని ముంబాయి సినీ వర్గాల టాక్. ఈ సినిమాలో రన్ బీర్ కపూర్ ను హీరోగా అనుకుంటున్నరంట.ఈ విషయాలపై ఆయన అధికారిక ప్రకటన చేయలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: