సాహో సినిమా విపరీతమైన నెగిటివ్ టాక్ సంపాదించినా.... కలెక్షన్ల విషయంలో మాత్రం రికార్డుల మోత మోగించింది. సినిమాకి సంబంధించి రివ్యూలు ఎంత ఘోరంగా వచ్చినా కుడా అందులోని యాక్షన్ సీన్స్ కి మాత్రం ఫుల్ మార్క్స్ వేశారు క్రిటిక్స్. హాల్ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా సినిమాలో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ఉందని కొనియాడారు. మొత్తంమీద ప్రభాస్ క్రేజ్ తో వచ్చిన కలెక్షన్స్ మరియు యాక్షన్ సీక్వెన్స్ లకి వచ్చిన ప్రశంసలు కలిపి ప్రభాస్ ను మరోసారి ఇలాంటి సినిమా చేసేందుకు ఉసిగొలుపుతున్నట్లు ఉన్నాయి.

మరో వైపు అతి భారీ డిజాస్టర్లతో కుదేలు అయిపోయాడు అనుకున్న పూరిజగన్నాథ్ కాస్తా ఇస్మార్ట్ శంకర్ తో మళ్లీ గాడిలో పడినట్లు కనిపిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం ఏమిటంటే పూరి జగన్నాథ్ ప్రభాస్ తో కలిసి ఒక సినిమా చేసేందుకు సన్నాహాలు జరుపుతున్నాడట. అందుకు ప్రభాస్ కూడా సముఖంగా ఉన్నట్లు సమాచారం. అది కూడా అచ్చం సాహో లాంటి హాలీవుడ్ రేంజ్ చిత్రం అని అంటున్నారు. ఇదివరకే ప్రభాస్ తో బుజ్జిగాడు మరియు ఏక్ నిరంజన్ చేసిన జగన్, ప్రభాస్ తో హ్యాట్రిక్ చిత్రం చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఏక్ నిరంజన్ బోల్తా కొట్టగా బుజ్జిగాడు మాత్రం మంచి హిట్ అయ్యింది.

ప్రస్తుతం ప్రభాస్ 'జాన్' సినిమా కోసం మళ్లీ యూరప్ వెళ్ళిపోయి షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. గత కొద్ది సంవత్సరాలుగా యాక్షన్ సినిమాలు తీస్తున్న ప్రభాస్ ఈ సినిమాలో పూర్తి లవర్ బాయ్ గా మారినున్నాడట. ఈ విషయాన్ని తాజాగా ఇంస్టాగ్రామ్ ద్వారా హీరోయిన్ పూజాహెగ్డే ధ్రువీకరించింది. మరోవైపు పూరి కూడా విజయ్ దేవరకొండతో ఒక మంచి యాక్షన్ ఎంటర్టైనర్ చేసే పనిలో పడ్డాడు. దేవరకొండతో తీయనున్న ఈ చిత్రానికి పూరీనే ప్రొడ్యూసర్. ఒకవేళ ఈ కాంబో కానీ వర్కౌట్ అయితే ఎలాంటి ఫలితం వస్తుందో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: