ప్రపంచంలో ఇటీవల కాలుష్యం ఎక్కువైపోయి మనిషి ఆరోగ్య మనుగడకే ప్రమాదం వాటిల్లే రోజులు వచ్చాయి. ఆక్సిజన్ ఎక్కువగా అందించే మహావృక్షాలు రోజు రోజుకి అంతమవుతున్న నేపథ్యంలో చాలా మంది ఈ విషయంపై సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు ప్రపంచంలో గొప్ప అటవీ సంపదగా చెప్పబడే అమెజాన్ అడవులు తగలబడి పోతుండటం పై సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేశారు. దీని పైనే సూపర్ స్టార్ మహేష్ బాబు మళ్లీ టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కొంత మంది యంగ్ హీరోలు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. మహేష్ బాబు అయితే ట్విట్టర్ లో చేసిన పోస్ట్ అటు అభిమానుల్లో ఇటు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


ఇంతకీ ట్విట్టర్ లో మహేష్ బాబు ఏం పెట్టడం అంటే ``మన భూగ్రహానికి ఊపిరితిత్తులు అని చెప్పుకునే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అగ్నికి ఆహుతి అవుతోంది. భూమిపై నివశించేవారంతా నిదుర లేవాల్సిన తరుణమిదని గ్రహించాలి. అమెజాన్ కోసం ప్రార్థించండి`` అంటూ అమెజాన్ అడవులు తగలబడుతున్న దృశ్యం ఫోటోని మహేష్ ఫ్యాన్స్ కి షేర్ చేశారు. ఇదిలా ఉండగా మహేష్ బాబు స్పందించిన తీరు పై కొంతమంది అభిమానులు సీరియస్ అవుతున్నట్లు సమాచారం.


అదేమిటంటే ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో నల్లమల అడవులు విషయమై చాలామంది ఇండస్ట్రీకి చెందిన వారు అక్కడ నల్లమల తవ్వకాలను ఆపాలని ప్రకృతికి ఎటువంటి భంగం కలిగించకూడదని నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్...విజయ్ దేవరకొండ ఇంకా చాలామంది పెద్ద పెద్ద స్టార్లు స్పందించడం జరిగింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మొన్న అడవులపై స్పందించకుండా మహేష్ బాబు ఎక్కడో తగలబడుతున్న అమెజాన్ అడవుల విషయంలో స్పందించడం పై చాలా మంది అభిమానులు మహేష్ బాబు నీ నిలదీస్తున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: