ఎన్నో అంచనాల మధ్య విడుదలైన సాహో డివైడ్ టాక్ ని తెచ్చుకుని బాక్సాఫీసు వద్ద చతికిల పడింది. బాహుబలి తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న చిత్రం అవడంతో ఈ సినిమాపై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ సినిమా చూసేసరికి నీరుగారిపోయారు. ప్రభాస్ రెండేళ్ళ కష్టం వృధా అయిపోయిందే అని అభిమానులు బాధపడ్డారు. నిజంగానే ఈ సినిమాకి ప్రభాస్ చాలా కష్టపడ్డాడు.


బాహుబలిని మించి ఈ సినిమాని ప్రమోట్ చేశాడు. బాహుబలి ప్రమోషన్లలో ప్రభాస్ ఎక్కువగా కనిపించలేదు. కానీ సాహో సినిమాకి ఆయన దేశం మొత్తం తిరిగాడు. సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని, తన అభిమానుల కోసమే ఈ సినిమా తీశానని చెప్పుకొచ్చాడు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక వారి అంచనాలు తల్లకిందులయ్యాయి. మొదటి షో నుండి నెగెటివ్ టాక్ తెచ్చుకుని కలెక్షన్ల పరంగా స్లో అయింది.


అయితే ఇక్కడ చెప్పుకొవాల్సింది ఏంటంటే బాలీవుడ్ లో మాత్రం దూసుకుపోతుంది. ఇటీవలే బ్రేక్ ఈవెన్ ని కూడా దాటి లాభాలు పంచే దిశగా ముందుకు వెళ్తుంది. బాలీవుడ్ లో దక్కిన ఆదరణ మిగతా చోట్ల దక్కలేదు. అయితే ప్రభాస్ సాహో సినిమా గురించి ఇంతవరకు మాట్లాడలేదు. విడుదల అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన పెదవి విప్పలేదు. సినిమా పరాజయం అయ్యాక హీరోలు మాట్లాడటం చూస్తుంటాం.


కానీ ప్రభాస్ అసలు మాట్లాడకపోవడం వింతగా ఉంది. పోనీ హైదరాబాద్ లో లేడా అంటే అది కాదు..ఇటీవలే హైదరాబాద్ లో సన్నిహితులతో కలసి సాహో సినిమా చూశాడు. గోపీచంద్ కొడుకు పుట్టినరోజు వేడుకలకీ హాజరయ్యాడు. కానీ అన్ని చోట్లా ప్రభాస్ మౌనాన్నే ఆశ్రయించాల్సి వచ్చింది. సాహో హిట్టని చెప్పలేదు, ఫ్లాపని ఒప్పుకోలేదు, పోనీ ఓ వర్గానికి నచ్చింది అని కూడా స్టేట్ మెంట్ ఇవ్వలేదు. మరి ప్రభాస్ ఇలా మౌనంగా ఎందుకు ఉంటున్నాడో ఆయనకే తెలియాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: