తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 3 అదరగొడుతోంది. ఇప్పటికే 8 వారాలు ముగించుకొని 9వ వారం లోకి అడుగుపెట్టిన షో లో దాదాపు ఏడుగురు వరకు ఇంటి సభ్యులు ఎలిమినేట్ అయ్యారు. ఇదే క్రమంలో మరో పక్క వైల్డ్ కార్డు రూపంలో ఇద్దరూ తమన్నా సింహాద్రి. శిల్పా చక్రవర్తి ఎంట్రీ ఇచ్చి హౌస్ లో ఎక్కువ రోజులు కొనసాగలేక పోయారు. లాస్ట్ వీక్ సండే నాడు ఎలిమినేషన్ ప్రాసెస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన శిల్ప చక్రవర్తి ఎలిమినేట్ కాక సోమవారం జరిగిన ఎపిసోడ్ లో మళ్లీ ఎలిమినేషన్ నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ కావడం జరిగింది. ఇటువంటి క్రమంలో మామూలుగా అయితే సోమవారం నాడే నామినేషన్ ప్రక్రియ పూర్తై ఓటింగ్ మొదలవుతుంది.


కానీ నిన్న ఓటింగ్ లైన్లు తెరుచుకోలేదు. ఎందుకంటే నామినేషన్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. నిన్నటి ఎపిసోడ్ లో మహేష్ మాత్రం నామినేషన్ లోకి వచ్చాడు. దీంతో ఇంకా నామినేషన్ ప్రక్రియ కొనసాగనుంది. ఇటువంటి నేపథ్యంలో మరో పక్క ఈ వీక్ నామినేషన్ ప్రక్రియ ఉండదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే సీజన్ త్రీ స్టార్ట్ అయిన నాటి నుండి బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన సభ్యులను తిరిగి ఇంటిలోకి తీసుకురావటానికి బిగ్ బాస్ షో నిర్వాహకులు  రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. వీరికోసం ఓటింగ్ చేపట్టనున్నారని టాక్. అదే గనుక నిజమైతే అలీ రెజాకు అందరికంటే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది.


మరోపక్క సోషల్ మీడియాలో కూడా అలీ రెజా హౌస్ లోకి తీసుకురావాలని చాలా మంది నెటిజన్లు కోరుకుంటున్నారు. అంతేకాకుండా హౌస్ నుండి రోహిణి కూడా అనవసరంగా ఎలిమినేట్ అయినట్లు వార్తలు వినబడుతున్నాయి. దీంతో ఇప్పటిదాకా ఎలిమినేట్ అయిన సభ్యుల విషయంలో బయటకు వచ్చిన సమాచారం మేరకు కంటెస్టెంట్ లను తిరిగి లోపలికి తీసుకోవడం నిజమే అయితే కచ్చితంగా అలీ రెజా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం గ్యారెంటీ అని చాలామంది కామెంట్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: