వరుణ్ తేజ్ హీరోగా హరీష శంకర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం "వాల్మీకి". రామ్ ఆచంట, గోపీ ఆచంట కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబరు ఇరవైయవ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడుదలైఇన టీజర్ ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది. తమిళంలో సూపర్ హిట్ సాధించిన "జిగర్తాండ" మూవీకి ఇది తెలుగు రీమేక్ అన్న విషయం తెలిసిందే.


మిక్కీ జె మేయర్ అందించిన స్వరాలు చాలా కొత్తగా ఉన్నాయి. మామూలుగా ఆయన పాటల్లో కనిపించే మెలోడీ కన్నా ఈ సినిమాలోని పాటలు మాస్ సాంగ్స్ ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. అయితే వాల్మీకి సినిమాలో అలనాటి తారలు శోభన్ బాబు, శ్రీదేవి లు నటించిన దేవత సినిమాలోని  సూపర్ హిట్ పాట "ఎల్లువచ్చి గోదారమ్మ"ని రీమిక్స్ చేశారు. ఈ సాంగ్ ప్రోమోని దర్శకేంద్రుడి చేతుల మీదుగా నిన్న సాయంత్రం రిలీజ్ చేశారు.


అనంతరం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ, నాకీ అవకాశ్ం ఇచ్చి నన్ను పాతిక సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళారు. దేవత సినిమాలో ఆ పాటని షూట్ చేయాలనుకున్నప్పుడు చాలా గమ్మత్తు జరిగిందని వివరించాడు. ఈ పాటని షూట్ చేయడానికి రాజమండ్రి దగ్గర్లోని ఉండ్రాజవరం అనే ఊరికి వెళ్లాం. అక్కడ ఒక డాబా కూర్చుని ఆలోచిస్తున్నప్పుడు పక్కన టప్ టప్ అని చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. అవేంటని అడిగితే ఈ ఊళ్ళో వాళ్ళు బిందెలు తయారు చేస్తారు. ఆ చప్పుడు వాటిదే అన్నారు.


వెంటనే బిందెల తో షూట్ చేయాలనే ఆలోచన వచ్చిందని అన్నారు. ఈ పాట ఇంత బాగా రావడనికి కారణమైన రామానాయుడు గారికి, వేటూరి సుందర రామ్మూర్తి గారి దన్యవాదాలు తెలియజేశారు. ఇక ఆ సాంగ్ ని  అదే పద్దతిలో హరీష్ శంకర్ తీయడం బాగుందని, తనకి నచ్చిందని చెప్పుకొచ్చారు.




మరింత సమాచారం తెలుసుకోండి: