టాలీవుడ్ లో ఈ మద్య వరుసగా మల్టీస్టారర్ మూవీస్ లో నటిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ హ్యాపీగా కొనసాగిస్తున్నారు విక్టరీ వెంకటేష్. ఈ సంవత్సరం అనీల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘ఎఫ్ 2’ మూవీ తో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీలో వరుణ్ తేజ్ తో వెంకటేష్ చేసిన కామెడీకీ తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక్కడే కాదు..ఓవర్సీస్ లో కూడా దుమ్మురేపింది ఎఫ్ 2 మూవీ. తాజాగా బాబీ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్,యువ సామ్రాట్ నాగ చైతన్య నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘వెంకిమామ’.
వాస్తవానికి రియల్ లైఫ్ లో కూడా వీరిద్దరూ మామా అల్లుళ్లు కావడం విశేషం. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ షరవేగంగా జరుగుతుంది. అయితే ఈ మూవీ అక్టోబర్ లో రిలీజ్ చేయాలని భారీ సన్నాహాలే చేశారు..కానీ అక్టోబర్ 2 న మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ హిట్ టాక్ వస్తే..అందులోనూ మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ ఎలాంటిదో టాలీవుడ్ కి తెలిసిందే..ఈ కారణంతో ‘వెంకిమామ’ అక్టోబర్ లో రిలీజ్ చేస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని.., డిసెంబర్ ఫస్టు వీక్ లో ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. ఈ మూవీ ఒక పాట మినహా ఈ చిత్రీకరణను పూర్తిచేసుకుంది.
సినిమాలో మేనమామ - మేనల్లుడు పాత్రల్లో ఈ సినిమాలో వెంకటేశ్, చైతూ నటిస్తున్నారు. ఈ ఇద్దరి సరసన నాయికలుగా రాశి ఖన్నా, పాయల్ నటిస్తున్నారు. ఈ మూవీ మంచి వినోదభరితంగా సాగుతుందని చిత్ర యూనిట్ అంటున్నారు. గతంలో బాబీ దర్శకత్వంలో రవితేజ నటించిన ‘పవర్’ సినిమా కామెడీ, యాక్షన్ తో ఇరగదీసిన విషయం తెలిసిందే.