అరవింద సమేత లాంటి హిట్ వచ్చినా కూడా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో 'అల వైకుంఠపురములో' సినిమా చేస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఈ సినిమా పెద్ద పరీక్షలా మారింది. దీనికి కారణం సంక్రాంతి రిలీజ్. గతేడాది పవన్ కళ్యాణ్ తో 'అజ్ఞాతవాసి' తీసి సంక్రాంతికి విడుదల చేసిన మాటల మాంత్రికుడు ఆ సినిమాతో తన కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ అందుకున్నాడు. ఆ దెబ్బతో త్రివిక్రమ్ పై మెగా ఫ్యాన్స్ అసహనం చూపించి గట్టిగానే విరుచుకుపడ్డారు. సంక్రాంతి సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందనుకున్న'అజ్ఞాతవాసి' అడ్రస్ లేకపోవడంతో ట్రేడ్ వర్గాలు కూడా షాక్ కు గురయ్యారు.

మళ్ళీ ఇప్పుడదే సంక్రాంతి డిజాస్టర్ ని మర్చిపోయేలా వచ్చే ఏడాది సంక్రాంతికి 'అల వైకుంఠపురములో' సినిమాతో మెగా ఫ్యాన్స్ కి బ్లాక్ బస్టర్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడు త్రివిక్రమ్. 'అజ్ఞాతవాసి'తో అందుకోలేకపోయిన సంక్రాంతి బ్లాక్ బస్టర్ ను ఈ సినిమాతో అందుకొని మళ్లీ తన సత్తా చాటుకోవాలని చూస్తున్నాడు. బన్నీ కూడా సంక్రాంతి సీజన్ లో మంచి కమర్షియల్ హిట్ కొట్టి చాలా ఏళ్ళయింది. 'దేశ ముదురు' తరువాత స్టయిలిష్ స్టార్ కి ఇదే సంక్రాంతి సినిమా.

సంక్రాంతికి ప్రేక్షకులను మెప్పించడానికి త్రివిక్రమ్ అన్ని రకాలుగా సిద్దమవుతున్నాడు. ప్రతీ విషయంలోను  జాగ్రత్త వహిస్తున్నాడు. ముఖ్యంగా అజ్ఞాతవాసి నిరాశపరిచిన మెగా అభిమానులను ఆకట్టుకునేలా ప్లాన్ చూసుకుంటున్నాడు. ఇక నా పేరు సూర్య తో ఫ్లాప్ అందుకున్న బన్నీ కూడా ఈ సినిమాతో మళ్లీ ట్రాక్ లోకి రావాలని ట్రై చేస్తున్నాడు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత ఈ ఇద్దరు కలిసి మూడో సినిమాతో సంక్రాంతి బరిలో ఎలాంటి హిట్ కొడతారో చూడాలి. అసలే సూపర్ స్టార్ సరిలేరు నీకెవ్వరు గట్టి పోటీ ఇవ్వనుంది. మరో వైపు కళ్యాణ్ రామ్ కూడా సంక్రాంతికి రెడీ అవుతున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: