హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ ఇటీవల రిలీజ్ అయి అదిరిపోయే హిట్ అందుకుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ మాస్ పాత్రలో అదరగొట్టేశాడు. గత చిత్రాలకు భిన్నంగా ఈ సినిమాలో వరుణ్ తేజ్ గుబురు గడ్డంతో మాఫియా లీడర్ గా కనిపించడంతో మెగా అభిమానులు అద్భుతంగా వరుణ్ తేజ్ ని రిసీవ్ చేసుకున్నారు. తమిళ చిత్రం జిగర్తాండ చిత్రానికి కొన్ని మెరుగులు దిద్ది హరీష్ శంకర్ ఈ సినిమాని రూపొందించడం జరిగింది. అయితే సినిమా అదిరిపోయే రీతిలో హిట్టు టాక్ సొంతం చేసుకోవడంతో ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో తాజాగా సినిమా సక్సెస్ సంబరాల్లో సినిమా యూనిట్ పాల్గొంది.


ఈ సమావేశంలో సినిమా హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ...ఇంతటి ఘనవిజయం అందించిన ఆడియన్స్ కి అభిమానులకు థాంక్స్ చెప్పాడు. అంతేకాకుండా హీరో నితిన్ కూడా థాంక్స్ చెబుతూ...డైరెక్టర్ హరీష్ శంకర్ గురించి మాట్లాడుతూ కళ్యాణ్ బాబాయ్ తో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని చేశారు. అలాంటి దర్శకుడు నాతో సినిమా చేస్తాడా అని ఆలోచించే వాడిని. కానీ గద్దలకొండ గణేష్ చిత్రంలో ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చింది అని వరుణ్ తెలిపాడు. సరిగ్గా సినిమా రిలీజ్ అవుతుంది అనగా 6 గంటలకు ముందు సినిమా టైటిల్ ని గద్దలకొండ గణేష్ గా మార్చాం.


ఆ విషయం మీ అందరికి తెలుసు. ఆ టైంలో నాకు చాలా భయమేసింది. ఈ సమయంలో టైటిల్ మార్చితే పరిస్థితులు ఎలా ఉంటాయో అని టెన్షన్ పడ్డా. వెంటనే చరణ్ అన్నకు ఫోన్ చేసి చెప్పా. వెంటనే ఇంటికిరా అని పిలిచాడు. ఆయన ఇంటికి వెళ్లగానే ఇంట్లో చరణన్న, జూ. ఎన్టీఆర్ గారు ఇద్దరూ కాఫీ తాగుతూ కనిపించారు. తక్కువ సమయంలోనే నా భయాన్ని మొత్తం పోగొట్టారు. చరణ్ అన్న, ఎన్టీఆర్ గారు నాలో ధైర్యాన్ని నింపిన ఆ సంఘటనని ఎప్పటికి మరచిపోలేను అని వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ సక్సెస్ మీట్ లో పేర్కొన్నాడు.  



మరింత సమాచారం తెలుసుకోండి: